‘మోడి ఇడి లది భార్యభర్తల అనుబంధం’

ఆంధ్రలో ప్రధాని మోడీని  బాగా అపకీర్తి పాలు చేసే పనిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇపుడు ఇడి (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ ) దాడులను చూపి మోడీ మీద దాడి ఉధృతం చేసింది.

ఈ మధ్య టిడిపి నేత, రాజ్య సభ సభ్యుడు, మోదీ మంత్రి వర్గంలో మొన్నటి దాకా మంత్రిగా ఉన్న సుజనా చౌదరి మీద ఇడి దాడులు జరిగిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి రు. 6000 కోట్ల కు బ్యాంకులను మోసం చేశాడని ఇడి ట్విట్టర్ లో స్పష్టంగా పేర్కొంది. దీనిని మీద ఈ రోజు టిడిపి దాడి ప్రారంభించింది. ఇవన్నీ మోడీ చేయిస్తున్న దాడులని పార్టీ ఆరోపిస్తున్నది.

తెదేపా అధికార ప్రతినిధి,ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న  ఇడి , మోడీ ల గురించి ప్రస్తావిస్తూ, మోడీ ఇడి  భార్య భర్తల బంధం అని, వారిద్దరు భార్యభర్తాల్లా  కలిసి పనిచేస్తున్నారని చురక వేశారు.

‘ప్రధాని మోడీ తన కనుసన్నల్లో ఇడి ని నడుస్తున్నది. ఇడి పై దేశ ప్రజలకు నమ్మకం పోయేలా చేస్తున్నారు.తన రాజకీయ శత్రువులపై మోడీ ఇడిని ప్రయోగిస్తున్నారు.’ అని విమర్శించారు.

బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి బ్యాంకులను ముంచేవారి వారిని దేశాలు దాటిస్తూ, అప్పులు తీరుస్తామంటున్నవారిని సతాయిస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు.

‘సుజనా చౌదరి స్వయంగా చెప్పారు,అప్పులు ఉన్నాయని ,బ్యాంకులు ఉన్నది వ్యాపారులకు అప్పులు ఇవ్వడానికే.అప్పులు కట్టము అని ఎప్పుడు సుజనా చెప్పలేదు,’ అని బుద్ధా వెంకన్న అన్నారు.

‘వ్యాపారాలు చేసేవారికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వకూడదని ఎక్కడైనా ఉందా ?

అప్పులు కన్నా ఆస్తులు ఎక్జువ ఉన్నాయని సుజనా చెబుతూనే ఉన్నారు.  ప్రధానితో ఒక్క ప్రకటన చేయించండి వ్యాపారాలు చేయకూడదు అని,వెంటనే అప్పులు కట్టేస్తారు, అని అంటూ నిద్రమాత్రలు వేసుకున్న మోడీ కి చంద్రబాబు దెబ్బతో నిద్రపట్టడంలేదని ఆయన అన్నారు.

 

‘రాఫెల్ కుంభకోణం గురించి భాజపా నాయకులు ఎందుకు మాట్లాడరు? భాజపా నాయకులకు బ్యాంకులలో అప్పులు లేవా ? వ్యాపారాలు లేవా ఎందుకు భాజపా నాయకులపై ఈడీ దాడి చేయదు. 2019 తరువాత మోడీ విదేశాలకు వెళ్లిపోవడం ఖాయం’ అని అన్నారు.