గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో భూప్రకంపనలు

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శనివారం భూప్రకంపనలు కలకలం రేపాయి. శనివారం మధ్యాహ్నం సమయంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో వారంతా ఇండ్ల నుంచి బయటికి వచ్చారు. అసలు ఏం జరుగుతుందో వారికి అర్ధం కాలేదు. స్వల్పంగా భూమి కంపించిందని తెలుసుకొని వారు షాక్ కు గురయ్యారు. ఇండ్లలోకి వెళ్లకుండా వారు బయటే గడుపుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.