నకిలీ ఓట్ల జాబితా ప్రకటించిన ఏపీ ఎన్నికల సంఘం

ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపునకు ఇటీవల దాఖలైన ఫామ్-7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవేనని ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓట్లను తొలగించాల్సిందిగా తమకు 9.5 లక్షల దరఖాస్తులు అందగా, వాటిలో కేవలం 1.41 దరఖాస్తులను మాత్రమే ఆమోదించి ఓట్లను తొలగించామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జిల్లాల వారీగా తొలగించిన ఓట్ల వివరాలను ఈసీ ప్రకటించింది. ఇందులో సగం నకిలీ ఓట్లు తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి.

శ్రీకాకుళం – 2,579
విజయనగరం- 5,166
విశాఖపట్నం- 2,407
పశ్చిమ గోదావరి- 8,669
ప్రకాశం- 6,040
నెల్లూరు- 3,850
కడప- 5,292
కర్నూలు- 7,684
అనంతపురం- 6,516
గుంటూరు- 35,063
తూర్పుగోదావరి- 24,190
కృష్ణా- 19,774
చిత్తూరు- 14,052