డికె అరుణ.. ఒళ్లు దగ్గర పెట్టుకో, నీ బండారం బయటపెడతాం: కేసీఆర్

వనపర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. డికె అరుణ పై కేసీఆర్ ఫైర్ అయ్యారు. డికె అరుణా… ఒళ్లు దగ్గర పెట్టుకో… నీ బండారం బయట పెడుతా.. జాగ్రత్త.. ఇంటింటికి తిరిగి నీ చరిత్ర బయటపెడుతానని కేసీఆర్ డికె అరుణను హెచ్చరించారు. చూసుకుందాం రండిరా నా కొడకల్లారా అని మాట్లాడుతావు… డికె అరుణ నీ సంగతి చెప్తాం ఆగు బిడ్డా అని కేసీఆర్ హెచ్చరించారు.

నాడు సమైక్య పాలనలో హంద్రీనీవా కాల్వ 300 కిలోమీటర్లు తవ్వుకుపోతాం అని రఘువీరారెడ్డి అంటే ఆయనకు ముందుండి హారతులు పట్టింది డీకె అరుణ కాదా, ఆ సాక్ష్యాలన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు. కత్తులు తిప్పటం కాదు ఇప్పుడు తిప్పితే ఏం సక్కదనం, తిప్పాల్సిన కాడ తిప్పలేదని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మహబూబ్ నగర్ జిల్లాలో శనిలాంటి నాయకులు కాంగ్రెస్ నాయకులున్నారని, అందులో ఈ శని దేవత డికె అరుణ అన్నారు. ఇప్పటి వరకు గద్వాలకు ఆమె చేసిన ఘనకార్యమేందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా ఆలోచించి ఎవరు కావాల్నో తేల్చకోని ఓట్లేయాలన్నారు. నోటికి ఎంతకు వస్తే అంతకు మాట్లాడుతున్నారని తస్మాత్ జాగ్రత్త… అని కేసీఆర్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.