ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయనున్న సీఎం

ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లికి ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్చి 1 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్టు కేజ్రివాల్ ప్రకటించారు. ఢిల్లికి సీఎంగా ఎవరు ఉన్నా వారు బొమ్మలుగానే మారాల్సి వస్తుందన్నారు. అసలు రాష్ట్రాల పై కేంద్రం పెత్తనం ఏందని ప్రశ్నించారు.

ఢిల్లికి రాష్ట్ర హోదా ప్రకటించే వరకు తాను ఆమరణ నిరాహార దీక్ష విరమించనని ప్రకటించారు. అవసరమైతే చావనైనా చాస్తా కానీ వెనక్కి తగ్గేది లేదని కేజ్రివాల్ ప్రకటించారు. దీంతో హస్తిన రాజకీయాలు వేడెక్కాయి. కేజ్రివాల్ దీక్షకు మమతా బెనర్జీ, దేవేగౌడ, చంద్రబాబు మరియు కీలక నేతలు సంఘీభావం తెలిపే అవకాశం ఉంది.