సంచలనం : ఇద్దరిపైనా లుకౌట్ నోటీసుల జారీ

తెలంగాణా సైబర్ క్రైం పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న టివి9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీలు దేశం వదిలి పారిపోకుండా ముందుజాగ్రత్తగా లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దేశంలోని అన్నీ ఎయిర్ పోర్టులకు వీళ్ళ ఫొటోలు పంపటం సంచలనంగా మారింది.

విచారణలో పోలీసులకు సహకరించకుండా సతాయిస్తున్న వీళ్ళద్దరు అమరావతి ప్రాంతంలో దాక్కున్నట్లు ప్రచారం జరుగుతోంది. బహుశా 23వ తేదీ ఫలితాలు వచ్చే వరకూ అక్కడే ఉంటారేమో. ఒకవేళ ఆరోజు కౌంటింగ్ లో టిడిపి ఓడిపోతే ఏం చేస్తారు ? వెంటనే విదేశాలకు పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారేమో అని పోలీసులు అనుమానించారు.

ఎందుకంటే, ఇపుడు వీళ్ళద్దరికి షెల్టర్ ఇచ్చింది చంద్రబాబునాయుడే అన్న  ప్రచారం అందరికీ తెలిసిందే. అందుకనే వీళ్ళద్దరూ ప్రస్తుతం విజయవాడ ప్రాంతంలోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రేపటి కౌంటింగ్ లో టిడిపి ఓడిపోతే అటునుండి అటే విదేశాలకు పారిపోయే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకనే లుకౌట్ నోటీసులు జారీ చేశారు.