టిడిపి ఎమ్మెల్యే అనితకు సమన్లు జారీ చేసిన కోర్టు

చెల్లని చెక్కు ఇవ్వడంతో టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కోర్టు సమన్లు జారీ చేసింది. విశాఖ జిల్లా రాజుపేటకు చెందిన వేగి శ్రీనివాసరావు అనే వ్యక్తి దగ్గరి నుంచి అనిత రూ. 70 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంది. 2015 అక్టోబర్ నెలలో అనితకు శ్రీనివాసరావు పైసలు ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రాంసరీ నోటును, పోస్ట్ డేటెడ్ చెక్కును అనిత ఇచ్చారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతూ వచ్చాడు. కానీ ఆమె నుంచి స్పందన లేదు.

శ్రీనివాసరావు ఒత్తిడి తేగా 2018 జూలై 30న 70 లక్షల హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు చెక్కును అనిత ఇచ్చారు. అది తీసుకొని బ్యాంకుకు వెళితే అకౌంట్లో బ్యాలెన్స్ లేదని తేలింది. దీంతో శ్రీనివాసరారవు కోర్టును ఆశ్రయించారు. అన్ని ఆధారాలతో కోర్టును ఆశ్రయించారు.  దీంతో కోర్టు ఈ నెల 26న హాజరు కావాల్సిందిగా అనితకు సమన్లు జారీ చేసింది.