ఢిల్లీలో చంద్రబాబు మంతనాలు మొదలు, ఎయిర్ పోర్ట్ లోనే మొదటి మీటింగ్

 ఈ రోజు ఢీల్లీకి చేరుకున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు తన పాత మిత్రుడు కాంగ్రెస్ నేత  గులాం నబీ ఆజాద్ ను కలుసుకున్నారు. వారిరువురు ఒకపుడు కాంగ్రెస్ లోనే ఉండేవారు. ఒకే తరానికి చెందిన వారు.  గులామ్ నబీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా ఉన్నపుుడు   ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాకు పాతమిత్రుడే అని చెబుతుండేవారు.

ఇపుడు ముఖ్యమంత్రి  1996లో లాగా ఢిల్లీ బిజెపి వ్యతిరేక  ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసే పనిలో భాగాంగా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఈ అజాద్ తో సమావేశమయ్యారు.  ఈసాయంకాలం చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. దీనికి పరిచయ సమావేశమే ఇదని చెబుతున్నారు.

 1996లో అప్పటి ధర్డ్ ఫ్రంట్ (యునైటెడ్ ఫ్రంట్ )ఏర్పాటుచేయడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు.  1996 ఎన్నికల్లో 161 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బిజెపి 13 రెోజుల్లోనే దిగిపోయింది. ప్రధాని వాజ్ పేయి  మెజారిటీ కూడగట్ట లేేక పోయారు. అపుడు ప్రాంతీయపార్టీలను కలిపి  యునైటెడ్ ఫ్రంటు  ఏర్పాటుచేయడంలో చంద్రబాబునాయుడు ఆంధ్రాభవన్ కేంద్రంగా చక్రం తిప్పారు.  విపిసింగ్ , పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు ప్రధాని గా రావడానికి అంగీకరించకపోవడంతో  జనతాదళ్ దెవేగౌడను ప్రధానిగా ఎంపిక చేశారు.

ఇపుడు కూడా బిజెపికి వ్యతిరేకంగా ఫ్రంటుకూడకట్టే బాధ్యత స్వీకరించాలని చంద్ర  బాబు నాయుడికి అభ్యర్థనలొస్తున్నాయి. మొన్న సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ పోన్ చేసింది ఈ పని మీదే. దానికి తోడు ప్రాంతీయ పార్టీ నేతగా చాలా అనుభవం ఉన్న నాయకుడు, సీనియర్ నాయకుడు కావడంతో  చంద్ర బాబు ఇపుడు కూడా ఢిల్లీలో చాలా ప్రాముఖ్యం లభిస్తున్నది. తెలుగుదేశం, కాంగ్రెస్ చేతులు కలపడమనేది దేశ వ్యాపితంగా ఒక చర్చ కు దారి తీసింది.  1996 లో కూడా చంద్రబాబు నాయుడు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారం కేసరితో చర్చలు జరిపి దేవేగౌడకు మద్దతునిచ్చేలా ఆయనను ఒప్పించారు. ఒక బలమయిన ప్రాంతీయ పార్టీ  కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు ముందుకురావడం రాహుల్ ను కూడా ఉత్సాహపరుస్తున్నది.  తెలంగాణ కాంగ్రెస్ వర్గాలలో ఇది తీసుకువచ్చిన ఆత్మస్థయిర్యం అంతా ఇంతా కాదు. ఇదే విధంగా టిడిపి వర్గాలలో కూడా నూతనోత్సహాం కనబడుతుంది. ఇక రాజకీయాలొద్ద అనుకున్న మండవ వెంకటేశ్వరరావు  వంటి వాళ్లు కూడా మళ్లీ ముందుకు వస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ లో సీట్లో కోసం ఎంత చాలా గట్టిపోటీ నడుస్తూ ఉంది. ఇది తెలంగాణ పరిస్థితి.

అయితే, జాతీయ స్థాయిలో 1996 నాటి పరిస్థితి వేరు. ఇప్పటి పరిస్థితి వేరు. అపుడు బిజెపికి సొంతంగామెజారిటీ రాలేదు. ఇపుడు బిజెపి పార్లమెంటులో బలమయిన పార్టీ. ప్రధాని మోదీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేస్థాయికి బిజెపిని తీసుకువచ్చారు.

అపుడు కాంగ్రెస్ కూడా బలంగా నే ఉండింది.  అందువల్ల, ఇపుడు బిజెపి వ్యతిరేకత, మోదీ వైఫల్యాలు అనేది తప్ప చాలా విషయాల్లో పరిస్థితులు మారిపోయాయి.

శరద్ పవార్ తో చంద్రబాబు నాయుడు

ఇలాంటపుడు చంద్రబాబు ఢిల్లీలోఏ ఎత్తులు పైఎత్తులు వేస్తారో చూడాలి. గతంలో తనకు ప్రధాని అయ్యేందుకు అవకాశం వచ్చిందని, అయితే, చిన్నబాబు సలహామేరకు తాను ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారని చంద్రబాబే చెబుతూ వస్తున్నారు. అయితే, ఇది ఢిల్లీ రికార్డులలో ఎక్కడా నమోదు కాలేదు.

ఇపుడు మళ్లీ చంద్రబాబుకు జాతీయ రాజకీయాలలో  ఒక కీలకపాత్ర పోషించే అవకాశమొచ్చింది. ఈ సారి ప్రధాని అయ్యే ఆఫర్ వస్తుందా; ఏమవుతుందో చూడాలి.

ఢిల్లీలో ఆయన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టి అధినేత శరద్ పవర్, జమ్ము కాశ్మీర్  నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా వంటి పలువురు సీనియర్ నేతలను కలుసుకుంటున్నారు.