జవాన్ల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు 

ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అమరుల త్యాగాలను దేశం ఎప్పటికి గుర్తుంచుకుంటుదని వారి మరణం వృథా కాదన్నారు. ఈ సమయంలో జవాన్ల కుటుంబాలకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

 ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఇటువంటివి మళ్లీ జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉగ్రదాడిలో జవాన్లు చనిపోవడం బాధాకరమని చెప్పారు. దేశంలో ఉన్న అన్ని వర్గాల వారు అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు.