పులివెందులపై మనసుపడుతున్న చంద్రబాబు… వైరల్ కామెంట్స్!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో మాంచి ఊపుమీదున్నట్లు కనిపిస్తున్న చంద్రబాబు… రాబోయే ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరెయ్యాలని కేడర్ కు పిలుపునిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కోరిన కోర్కెలు, దానికి నెటిజన్లు ఇస్తున్న సమాధానాలు వైరల్ గా మారాయి.

సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలోనూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. దీనికోసం ప్రతి ఒక్కరూ కొంచె ఎఫర్ట్ పెట్టాలని సూచించిన ఆయన… పులివెందుల గెలుచుకుంటే వైసీపీ పతనం ఖాయమని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు పడుతున్న కష్టంలో కొంచెం ఎక్కువగా కష్టపడితే.. మార్పు తథ్యమని చెప్పారు.

దీంతో కీబోర్డులకు పని చెబుతున్న వైసీపీ శ్రేణులు… ఆన్ లైన్ వేదికగా హాట్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సందర్భంగా నేరుగా చంద్రబాబే పులివెందులలో పోటీ చేయాలని గతంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను షేర్ చేస్తున్నారు. ప్రతిసారీ బీటెక్ రవిని బలిచేయడం పాపమని.. ఈ సారి ఆ అవకాశం చంద్రబాబు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదే క్రమంలో… కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలను తెరపైకి తెస్తున్న నెటిజన్లు… ఈసారి ఆ రెండు సీట్లనూ కచ్చితంగా గెలిచి తీరాలని బాబుకు సూచిస్తున్నారు.

ఏది ఏమైనా… పులివెందులను కొట్టాలనే బాబు కోరికతో టీడీపీ కేడర్ లో కొత్త ఉత్సాహం వచ్చిందని.. బాబు రెగ్యులర్ గా ఆ నియోజకవర్గంపై దృష్టి సారించాలని చెబుతున్నారు విశ్లేషకులు!

కాగా… లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ దూకుడు ప్రదర్శించి కుప్పాన్ని కూడా ఆక్రమించుకోగా… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ కి టీడీపీ షాకిచ్చిన సంగతి తెలిసిందే!