1983 నాటి చైతన్య రధం పై హరిక్రిష్ణ ఆంతిమ యాత్ర?

చైతన్య రధం పై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు రాష్ట్రమంతటా 1983లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

అప్పట్లో అన్నీ తానై నడిపించిన ఎన్టీయార్ ను  హరిక్రిష్ణ నడిపించారు. ఈ చైతన్య రథం మీది నుంచే హరికృష్ణ అంతిమయాత్ర సాగనున్నట్లు సమాచారం. ఈ మేరకు పరిశీలన జరగుతుూ ఉందని తెలుగుదేశం వర్గాలు చెప్పాయి.

అది సాధ్యమయితే  హైదరాబాద్లోని రామకృష్ణ సినీ స్టూడియోలో ఉన్న చైతన్య రథాన్ని అంతిమ యాత్రకు సిద్ధం చేస్తారని ఈ వర్గాలు తెలిపాయి.

ఇదే వాహనాన్ని ఆయన 1999 లో తన సొంత పార్టీ  ‘అన్నటిడిపి’ ప్రచారానికి వాడుకున్నారు. ఈ ఫోటో  ఆయన పోటీ చేసిన గుడివాడ నియోజకవర్గం లో సాగిన ప్రచారంలోనిది.

తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు..

హరిక్రిష్ణ కుటుంబ సభ్యులతో చర్చించి తగు ఏర్పాట్లు చేయాలని సీఎస్ కు సూచనలిచ్చారు.

హరిక్రిష్ణ రోడ్డు ప్రమాదానికి గురైన వార్త తెలుసుకున్న వెంటనే  తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.