బిగ్ బ్రేకింగ్ : విశాఖపట్నం రైల్వేజోన్ ఏర్పాటు

ఎన్నికలకు ముందు ఏపి విషయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగున్నరేళ్ళుగా పెండింగ్ లో పెట్టిన రైల్వేజోన్ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుంది.  విశాఖపట్నం రైల్వేజోన్ కు కేంద్రప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్ ఓ ప్రకటన చేశారు. విశాఖపట్నం కేంద్రంగా కేంద్రప్రభుత్వం నూతన రైల్వేజోన్ ఏర్పాటు చేస్తున్నట్లు గోయెల్ ప్రకటించారు.  విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయబోయే రైల్వేజోన్ కు సౌత్ కోస్ట్ రైల్వేజోన్ గా కేంద్రమంత్రి నామకరణం కూడా చేశారు. గుంటూరు, విజయవాడ, గుంతకల్ డివిజన్లను కొత్త జోన్ లో కలపనున్నారు. మార్చి 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడి విశాఖపట్నం వస్తున్నారు. రెండు రోజుల ముందు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవటం గమనార్హం.