ఆ మంత్రితో జగన్ అలా ఎందుకు అన్నారు … తాడేపల్లిలో ఇదే హాట్ టాపిక్ !

Buggana Rajendranath Reddy dissappointed with jagan one side desicion

అసెంబ్లీ స‌మావేశాలు మూడు రోజుల నుండి వాడి వేడిగా నడుస్తూ ఉన్నాయి.ఈ క్ర‌మంలోనే మండ‌లి కూడా ప్రారంభం కానుంది. ఉభ‌య స‌భ‌ల్లోనూ వైసీపీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతుంది . అయితే మండ‌లిలో ఆశించిన మేర‌కు మెజారిటీ లేదు. కానీ అసెంబ్లీలో మాత్రం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అసెంబ్లీలో అధికార ప‌క్షం బాగానే ఉంది క‌నుక‌… ఇక్కడ ఏదైనా లోటు పాట్లుంటే స‌రిచేసుకు నేందుకు చాలా యంత్రాంగ‌మే ఉంది. కానీ, మండ‌లిలో మాత్రం అలాకాదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మండలిని న‌డిపించ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఇద్ద‌రు మంత్రులు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌లు ఇద్ద‌రూ కూడా రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయ్యారు. దీంతో ఇక్క‌డ బాగా లోటు క‌నిపిస్తోంది. మ‌రోప‌క్క‌, ప్ర‌తిప‌క్షం టీడీపీ మాత్రం అనేక అస్త్రాల‌తో రెడీ అయింది. ఈ క్ర‌మంలో టీడీపీని నిలువ‌రించాలంటే వైసీపీ తరుఫున ఉద్దండ పిండాలు లాంటి నాయకులు ఉంటేనే టీడీపీ ని నిలవరించగలమని జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారాట. .

ఇప్పుడు హఠాత్తుగా జ‌గ‌న్ ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అదేంటంటే మండ‌లి ప‌క్ష మంత్రిగా ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డికి ప‌గ్గాలు అప్ప‌గించారు. వాస్త‌వానికి ఆయ‌న త‌న‌కు ఈ బాధ్య‌త వ‌ద్ద‌ని వెంట‌నే స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిసింది. అంతేకాదు, ప‌క్క‌నే ఉన్న మ‌రో మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ స‌ద‌రు బాధ్య‌త‌ను అప్ప‌గిస్తే.. వెంటనే భుజాన వేసుకోవాల‌ని అనుకున్నార‌ట కానీ, జ‌గ‌న్ మాత్రం మండ‌లిలో వైసీపీని గ‌ట్టెక్కించే బాధ్య‌త‌ను మంత్రి బుగ్గ‌న‌కు అప్ప‌గించేసి వెంట‌నే అక్క‌డ నుంచి వెళ్లిపోయార‌ట‌. బుగ్గ‌న త‌ల ప‌ట్టుకుని నాకెందుకీ సంత‌! అని అనేశారట.ఇంత‌లో అక్క‌డ‌కు వ‌చ్చిన రాజ‌కీయ స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కొన్ని నిర్ణ‌యాలు అంతే అలాగే ఉంటాయి. అయితే నీకు ఇబ్బంది లేదులే, అంతా బొత్స చూసుకుంటారు అని లాలించారట‌.ఈ విష‌యం వైసీపీ వ‌ర్గాల్లో ఆఫ్ ది రికార్డుగా చర్చల్లో ఉందట.