ఎక్స్ పైర్ డేట్ చెప్పిన బొత్స… తెరపైకి కీలక వ్యాఖ్యలు!

వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాన్.. భవిష్యత్తుకు భరోసా పేరుతో బస్సు యాత్ర చేస్తూ చంద్రబాబు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో యువగళం యాత్ర అంటూ చినబాబు లోకేష్ తిరుగుతున్నారు. ఈ సమయంలో ఏపీ సర్కార్ పై వీరు చేస్తున్న విమర్శల సంగతి తెలిసిందే. దీంతో వీరందరికీ కలిపి ఉమ్మడిగా ఇచ్చి పడేశారు ఏపీ మంత్రి బొత్స!

అవును… ఏపీ సర్కార్ పై అర్ధజ్ఞానంతో పవన్ కల్యాణ్, తనదైన ప్రత్యేక జ్ఞానంతో చంద్రబాబు, అజ్ఞానంతో లోకేష్ లు తీవ్ర విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఏపీ మంత్రి బొత్సా సత్యన్నారాయణ స్పందించారు. ఈ సందర్భంగా పవన్ – చంద్రబాబు – లోకేష్ ల విమర్శలకు ఎక్స్ పైర్ డేట్ చెప్పారు.

ఇందులో భాగంగా… ఉగాది తర్వాత సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్‌ అవుతుందని బొత్స సత్యన్నారాయణ జోస్యం చెప్పారు. ఈ ఆరునెలల కాలమే అరుపులు, కేకలు ఉంటాయని, అనంతరం తుపాకీ దెబ్బకు దొరకరన్నట్లుగా ఆయన ఎద్దేవా చేశారు. అనంతరం… 40 ఏళ్ల ఇండస్ర్టీ అని చెప్పుకునే చంద్రబాబు ఇంగితజ్ఞానం ఏమైందని బొత్స సీరియస్ గా ప్రశ్నించారు.

ఇదే సమయంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్న బొత్స… ప్రజలు తరిమికొడితే హైదరాబాద్ లో కాపురం ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే అని విమర్శించిన ఆయన.. ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు.

అనంతరం.. సెల్ ఫోన్ నేను కనిపెట్టానని చెప్పుకోవడానికి కనీసం సిగ్గుపడడం లేదా అని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో పవన్ పైనా బొత్స సీరియస్ గా స్పందించారు. సెలబ్రిటీ (పవన్‌ కల్యాణ్‌) కి టీడీపీ పాలన నచ్చడం అంటే పచ్చకామెర్ల వాళ్ళకు లోకం పచ్చగా కనిపించినట్టే అని సెటైర్లు వేశారు.

ఇదే సమయంలో అసలు లోకేష్ లెక్కల్లో మనిషే కాదని గాలి తీసేశారు బొత్స! ఈ సమయంలో తెలంగాణలో దోపిడీకి చంద్రబాబు కారకుడన్న ఆయన.. సైకిల్ పై కాలేజ్ కు వెళ్లిన చంద్రబాబు ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రస్తుతం చంద్రబాబు – పవన్ కల్యాణ్ – లోకేష్ ల పై బొత్స చెప్పిన జోస్యం వైరల్ అవుతోంది!

Minister Botsa Satyanarayana Comments on Pawan Kalyan | Nara Lokesh @SakshiTVLIVE