రోడ్డు ప్రమాదంలో యువ సింగర్ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువ బాలీవుడ్ సింగర్ దుర్మరణం పాలైంది. దీంతో బాలీవుడ్ లో విషాద చాయలు అలుముకున్నాయి. బాలీవుడ్ సింగర్ శివానీ భాటియా తన భర్త నిఖిల్ తో కలిసి కారులో ప్రయాణిస్తుంది. ఢిల్లీ యుమునా ఎక్స్ ప్రెస్ హైవేపై వీరి కారు బోల్తా పడడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే మధురలోని నివాస్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివానీ చనిపోగా నిఖిల్ పరిస్థితి విషమంగానే ఉంది.

ప్రమాదం జరిగిన సమయంలో నిఖిల్ డ్రైవింగ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆగ్రాలో ఫంక్షన్ కి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రీమిక్స్, పాప్ సింగర్ గా శివానీ అందరికి సుపరిచితం. శివానీ మృతితో బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.