జగన్ ను బాలయ్య కలవాలని పరితపించడం వెనక అసలు కారణం ఇదేనా ?

హిందూపూర్ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఎలాగైతే విలక్షణమైన పాత్రలు చేస్తూ, అభిమానులను ఆశ్చర్య పరుస్తుంటారో అలాగే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా కూడా ఆయన హిందూపూర్ ప్రజలను నిత్యం తన ప్రవర్తనతో ఆశ్చర్య పరుస్తుంటారు. కొన్ని రోజుల క్రితం నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి గురించి అడిగితే వాళ్ళను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. అయితే ఇప్పుడు బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఎందుకంటే ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్నానని వెల్లడించారు.

ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నిస్తే అపాయింట్ మెంట్ దొరకాలేదని, మరోసారి సమయం చూసుకొని అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తామని బాలకృష్ణ తెలిపారు. అయితే ఆయన ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు కలవబోతున్నారని రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి. హిందూపూర్ అభివృద్ధి గురించి చర్చించడానికే జగన్ ను బాలయ్యను కలవబోతున్నారని టీడీపీ వర్గాలు తెలిపారు. అలాగే జిల్లాల విభజనలో హిందూపూర్ నియోజకవర్గంను కూడా చేర్చాలని చెప్పడానికే బాలయ్య జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ జగన్ ను కలవాలనుకోవడం చర్చనీయాంశం అయ్యింది. బాలయ్య నిర్ణయంపై టీడీపీ అధినేత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉండగా ఇప్పటికే రెండు సార్లు బాలయ్యకు అపాయింట్ మెంట్ ఇవ్వని జగన్ మోహన్ రెడ్డి ఈసారైనా ఇస్తారో లేదో వేచి చూడాలి.

హిందూపురంలో ప్రభుత్వ ఆస్పత్రికి రూ.55లక్షల విలువైన కరోనా నివారణ ఔషధాలు, పరికరాలను అందజేశారు. తాను ఎక్కడ ఉన్నా కూడా హిందూపూర్ అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ఉంటానని వెల్లడించారు. కరోనా సమయంలో బాలకృష్ణ ఇప్పటికే చాలామందికి ఆర్థిక సహాయం చేశారు. అలాగే బసవతారకం హాస్పిటల్ లో పని చేస్తున్న సిబ్బందికి కూడా నిత్యావసర వస్తువులు బాలకృష్ణ అందించిన విషయం తెలిసిందే.