సుహాసిని కోసం బాలయ్య , కళ్యాణ్ రామ్ , జూనియర్ ఎన్టీఅర్

నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్ పల్లి లో తెలుగు దేశం పార్టీ తరుపున శాసన సభకు  పోటీచేస్తున్నారు .నామినేషన్  కూడా  దాఖలు చేశారు . ఈరోజు సుహాసిని  సోదరులు నందమూరి కళ్యాణ్ రామ్ , నందమూరి తారక రామారావు దీనిపై స్పందిస్తూ ” ప్రజలే దేవుళ్ళు , సమాజమే దేవాలయం అనే సిద్ధాంతం  టాటా గారు  స్వర్గీయ నందమూరి  తారక రామారావు  స్థాపించిన  తెలుగు దేశం పార్టీ మాకు ఎంతో పవిత్రమైనది . ఇక మా నాన్నగారు స్వర్గీయ నందమూరి హరి కృష్ణ గారు సేవలందించిన  తెలుగు దేశం పార్టీ  తరుపున ఇప్పుడు మా సోదరి సుహాసిని కూకట్ పల్లి పోటీచేస్తున్నారు .

స్త్రీలు  సమాజంలో ఉన్నత మైన పాత్రను పోషించాలని నమ్మే కుటుంబం మాది. ఈ స్పూర్తితో ఇప్పుడు మాసోదరి సుహాసిని కి విజయం వారించాలని కోరుకుంటున్నాము ” అని విజ్ఞప్తి చేశారు .

ఈ ప్రకటనను బట్టి చుస్తే నందమూరి కళ్యాణ్ రామ్ , జూనియర్ ఎన్టీ  రామా రావు ఇద్దరు కూకట్ పల్లి నియోజక వర్గంతో పాటు మిగతా నియోజక వర్గాల్లో కూడా ప్రచారం చేసే అవకాశం వుంది . బాలయ్య కూడా అన్న కూతురు సుహాసిని గెలిపించుకోవడానికి అక్కడ ప్రచారం చేస్తాడు .

చంద్ర బాబు తన మనసులోని ప్లాన్ ఈ రకంగా అమలు జరుపుతున్నాడు . తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ఉనికి  కోసం బాబు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు .