బాలకృష్ణ కూతురు జయలలిత ఫామ్ హౌస్ ను కొన్నారా.. నిజమేంటంటే?

Nara Brahmani

బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో నారా బ్రాహ్మణికి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నారా బ్రాహ్మణి సినిమా రంగానికి దూరంగా ఉన్నా వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. అయితే బ్రాహ్మణి జయలలిల ఫామ్ హౌస్ ను కొన్నారంటూ సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

వాస్తవానికి జయలలిత ఫామ్ హౌస్ ను పేరు ఊరు లేని కంపెనీ అయిన శ్రీ దుర్గా ఇన్ ఫ్రా డెవలపర్స్ అనే కంపెనీ కొనుగోలు చేసింది. అయితే ఈ కంపెనీ బ్రాహ్మణికి చెందిన కంపెనీ బ్రాహ్మణి ఫామ్ హౌస్ ను కొనుగోలు చేశారని జరుగుతున్న ప్రచారం ఆమెను హర్ట్ చేసిందని తెలుస్తోంది. తన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్న వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఆమె లీగల్ గా ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారని బోగట్టా.

వైసీపీకి చెందిన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు ఈ తరహా ఫేక్ వార్తలను ప్రచారంలోకి తెచ్చారని సమాచారం అందుతోంది. ఫేక్ వార్తలను ప్రచారంలోకి తీసుకొనిరావడం వల్ల వైసీపీకి లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మరోవైపు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లతో కొన్ని పోస్టులు ప్రచారంలోకి వస్తున్నాయి.

ఈ తరహా ప్రచారాల వల్ల వైసీపీకి మంచి కంటే చెడు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవఛు. ప్రజలకు మంచి పాలన అందించడం ద్వారా మాత్రమే వైసీపీపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వైసీపీ నేతలు సైతం ఫేక్ వార్తల ప్రచారం విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.