రైలు పట్టాల మధ్య పడ్డ చిన్నారి (వీడియో)

రైలు పట్టాలపై పడ్డ చిన్నారి అదృష్టవశాత్తు బయటపడింది. రైలు పట్టాల పక్కకు పడడంతో ఆ పాప ప్రాణాలతో దక్కింది. ఇది చూసిన వారు పాప ప్రాణాలు పోయాయనుకున్నారు. కానీ పాప సజీవంగా ఉండడంతో పాపను ఆ దేవుడే కాపాడాడని అంతా అనుకున్నారు.

ఉత్తర ప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్ లో నెంబర్ 1 ట్రాక్ పై ప్రయాణికులంతా నిలబడ్డారు. రైలు రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఓ మహిళ తన బిడ్డను ఎత్తుకొని ట్రాక్ పక్కకు నిలబడింది. ఇంతలో ఓ గూడ్స్ రైలు దూసుకొచ్చింది. చేతిలో ఉన్న పాప ఎగిరి పట్టాల మధ్య పడింది. గూడ్స్ రైలు పాప మీది నుంచి వెళ్లి చనిపోయిందని అంతా షాకయ్యారు. కానీ పాప అదృష్టవశాత్తు బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వీడియో కింద ఉంది చూడండి.