అబ్బో … అయ్యన్న పాత్రుడు కౌంటర్లకి విజయసాయి రెడ్డి మైండ్ బ్లాంక్ అయినట్లుందిగా !

ayyanna paatrudu shares interesting comments on vijayasai reddy

టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రతి విషయంలోనూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డిపై గత కొంత కాలంగా అయ్యన్న పాత్రుడి రివర్స్ ఎటాక్ కొనసాగుతుంది .సీఎం జగన్ గుట్టు బయటపెట్టాలని విజయసాయి కుట్రపన్నుతున్నారని , సీఎం జగన్ విషయం లో విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి .

ayyanna paatrudu shares interesting comments on vijayasai reddy
ayyanna paatrudu shares interesting comments on vijayasai reddy

విజయసాయి రెడ్డిపై తాజాగా సెటైర్లు వేసిన అయ్యన్నపాత్రుడు ఈ ప్రపంచంలో ప్రతి విషయంపైనా ట్విట్టర్లో ఎగిరి దూకే విజయసాయిరెడ్డి జడ్జిల విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ పై కిక్కురుమనటం లేదు ఎందుకు అంటూ ప్రశ్నించారు. జడ్జీలపై రాసిన లేఖ పై వ్యాఖ్యలు చేస్తే బెయిల్ రద్దు అవుతుందని భయమా? లేక అప్రూవర్ గా మారిపోయి అసలు గుట్లన్నీ బయటపెట్టేద్దామనా ? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అంతేకాదు రాజధాని అమరావతి విషయంలో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అయ్యన్నపాత్రుడు. అమరావతి మునిగిపోతుందని వైసిపి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారని భారీ వర్షాలకు మహానగరాలు వణికిపోయినా , అమరావతిలో చెంబెడు నీళ్లు కూడా నిలబడలేదని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు . ఒకే రాష్ట్రం , ఒకే రాజధాని అంటూ అయ్యన్నపాత్రుడు రాజధాని అమరావతికి జై కొట్టారు. ఇక ఇదే క్రమంలో సీత కన్నీరు రావణాసురుడు పతనం, ద్రౌపతి కన్నీరు కౌరవుల పతనం..అని అమరావతి మహిళల కన్నీరు వద్దు దీవెనలు తీసుకోండి అంటూ ఒక పోస్టర్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.