ఏపీపీఎస్సీ గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్ష వాయిదా

అభ్యర్దుల కోరిక మేరకు ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షను అధికారులు వాయిదా వేశారు. మార్చి 31న జరగాల్సిన పరీక్షను మే 26కి వాయిదా వేశారు. పరీక్షకు సన్నద్దం కావడానికి సమయం కావాలని అభ్యర్ధులు ఏపీపీఎస్సికి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అభ్యర్దులు సంతోషం వ్యక్తం చేశారు.