పాపం సోము… మురళీ దగ్గర మొత్తం కక్కేసారంటగా!

ఏపీ రాజకీయాల్లో బీజేపీ స్థానం ఎంత అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ.. పార్టీ పంచయతీలో మాత్రం అది చాలా పెద్ద పార్టీ అనే ఫీలింగ్ వస్తుంటుంది! ఈ మధ్యకాలంలో హస్తినలో కమలం పెద్దలు కూడా ఏపీలో బీజేపీ అభివృద్ధిపై కాస్త సీరియస్ గానే ఉండటంతో.. ఇప్పుడు అంతర్గత సమస్యలు మొత్తం వెలుగులోకి వస్తున్నాయంట. ఇందులో భాగంగా సోము ఫెర్మార్మెన్స్ గురించి హస్తిన రయబారికి సమాచారం ఇచ్చేశారంట!

అవును… కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే! దేశవ్యాప్తంగా మాంచి పొజిషన్ లో ఉన్న పార్టీని వీడి.. ఏపీలో రేపు ఏ పరిస్థితిలో ఉంటుందో తెలియని పార్టీలో కన్నా చేరారంటే.. అక్కడ బీజేపీ పరిస్థితి ఏమిటన్నది అర్ధం అవుతుందని.. హస్తిన పెద్దలు ఫీలయ్యారంట. దీంతో హుటాహుటిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్ ఏపీకి పంపించారు.

ఇలా ఏపీకి వచ్చిన మురళీధరన్ ఏకంగా సోము ఇలాకా అయిన రాజమండ్రీలోనే మీటింగ్ పెట్టారు. విచిత్రం ఏమిటంటే… మురళీ వచ్చినప్పుడు స్వాగతం పలికి తీసుకురావాల్సిన సోము వీర్రాజు కడపలో ఉండిపోయారుట! దీంతో… పార్టీ ప్రెసిడెంట్ లేకుండానే మురళీధరన్ పంచాయతీ పెట్టేశారు. ఇదే అదనుగా… చాలా మంది నాయకులు సోముకు వ్యతిరేకంగా.. మురళీధరన్ ముందు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారంట! ఇ ంతకాలం తమ కడుపులో దాచుకున్న బాదనంతా మురళీముందు కక్కేసారని తెలుస్తోంది!

అందులో మెజారిటీ నేతలు ఏకంగా సోము పోస్టుకే ఎర్త్ పెట్టారంట. అవును… ఎట్టి పరిస్థితుల్లోనూ సోము వీర్రాజు బీజేపీలో ఉండరాదు అంటున్న వారి సంఖ్య భారిగానే ఉందనేది లేటెస్ట్ అప్ డేట్. అసమ్మతి స్వరాలు ఈ స్థాయిలో పేరిగిపోవడంతో వీర్రాజు ని పదవిలో ఉంచుతారా.. దించుతారా.. అన్నది హాట్ టాపిక్ గా మారింది అంటున్నారు!