ఏపీలో వారికి ఈ సంవత్సరం స్కూల్ లేనట్టే !

కరోనా కారణంగా ఈ ఏడాది పాఠశాల విద్యార్థులకు జరగాల్సిన తుది పరీక్షలు వాయిదా పడ్డాయి. పదో తరగతి సహా అనేక తరగతుల విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ ఏడాది పలు తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు, మరికొందరికి సాధారణ తరగతులు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం వీలును బట్టి మరికొద్ది రోజుల్లోనే అన్ని తరగతుల విద్యార్థులకు రెగ్యులర్ క్లాసులు ప్రారంభించాలని భావించింది.

Govt tests app-based attendance system | Deccan Herald

అయితే తాజాగా ఒకటి నుంచి ఐదవ తరగతులకు బడులు తెరవరాదని విద్యాశాఖ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తెరిచే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. ఐదవ తరగతి వరకు ఈ విద్యా సంవత్సరం తరగతి గది బోధన వద్దని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు నిర్ణయించినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

అయితే 6 నుంచి 10 తరగతి విద్యార్థులకు మాత్రం కొన్ని రోజుల పాటు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఇంటర్‌, డిగ్రీ తరగతులను జనవరి 2వ తేదీ నుంచి మొదలుపెట్టాలని అధికారులు భావించారు. దీనిపై ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.