AP Minister Nimmala Blasts Jagan: జగన్ పాలనలో ఏపీ పతనం: మంత్రి నిమ్మల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నష్టం కన్నా, గత ఐదేళ్ల జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి, అప్పుల పాలు చేసిందని ఆయన ధ్వజమెత్తారు.

ఆదివారం పాలకొల్లు నియోజకవర్గంలో 53 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన అనంతరం మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధిని రద్దు చేశారని, అయితే చంద్రబాబు నాయుడు మానవత్వంతో దానిని పునరుద్ధరించారని ఆయన ఉద్ఘాటించారు.

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీలను అమలు చేసిందని మంత్రి నిమ్మల నొక్కి చెప్పారు. తమ ప్రభుత్వంలో పెన్షన్ సొమ్ము పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణం, “తల్లికి వందనం” కింద ప్రతి విద్యార్థికి రూ. 13 వేలు అందించామని స్పష్టం చేశారు. అంతేకాకుండా, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, గుంతలు లేని రోడ్లు, మత్స్యకారులకు రూ. 20 వేలు వంటి తదితర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, అభివృద్ధి కుంటుపడిందని మంత్రి నిమ్మల విమర్శించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి ప్రజలకు ఎంతో ఉపయోగపడే పథకాన్ని రద్దు చేయడం జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు.

Nara Lokesh To Meet PM Modi | Jagan | Chandrababu | KS Prasad | Telugu Rajyam