ఏపీలో రేపు జరగాల్సిన పదో తరగతి పరీక్ష వాయిదా

ఏపీలోని పలుచోట్ల ఈ నెల 22న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో శుక్రవారం జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పేపర్-1 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వాయిదా పడ్డ ఇంగ్లీష్ పేపర్ 1 పరీక్షను ఏప్రిల్ 3 వ తేదిన నిర్వహిస్తామని తెలిపారు. 23 శనివారం ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్ష యధావిధిగా జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని విద్యార్ధులు, తల్లిదండ్రులు గమనించి అందుకు అనుగుణంగా సిద్దమవ్వాలని కోరారు.