జగన్ జోలికి వస్తే నేనింతే అంటూ … నారా లోకేష్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన అనిల్ కుమార్ యాదవ్

anil kumar yadav sensationalcomments on lokesh babu

ఆంధ్ర ప్రదేశ్ : తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌ను ‘పప్పు మహారాజ్’ అంటూ మంత్రి సంబోధిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాను ఇలాగే మాట్లాడుతానని వ్యాఖ్యానించారు. నన్ను మీరు ‘నోటి పారుదల శాఖ మంత్రి’ అన్నా నష్టం లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్‌ ఆరోపణలకు సమాధానం చెప్పడమే మా ఖర్మ అని వ్యాఖ్యానించారు.

anil kumar yadav sensationalcomments on lokesh babu
anil kumar yadav sensational comments on lokesh babu

ముఖ్యమంత్రి జగన్‌ను లోకేష్ గోచి, గీచి అంటూ మాట్లాడుతున్నారని, మంగళగిరిలో అదే గతి పట్టిందని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఆయనకు గోచి కూడా మిగలదని ఎద్దేవా చేశారు. ఎంత మంది కట్టకట్టుకుని కుట్రలు పన్నినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన గురించి టీడీపీ నేతలు మర్యాదగా మాట్లాడితే మేమూ అలాగే మాట్లాడుతామని చెప్పారు.

లోకేష్‌ ముందు ట్రాక్టర్ సరిగా నడపడం నేర్చుకోవాలని మంత్రి అనిల్ ఎద్దేవా చేశారు. మీ పార్టీ నేతలే లోకేష్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరని, పోలవరం పనులు 70 శాతం పూర్తయితే మీసాలు తీసేస్తానన్న నేత ఎక్కడా అని మీసాలు లేని నేత మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామని స్పష్టం చేశారు. ఏ జన్మలో పుణ్యం చేసుకోబట్టే జగన్ కేబినేట్‌లో నీటిపారుదల శాఖ మంత్రిని అయ్యానని చెప్పుకొచ్చారు. జగన్ సీఎంగా పాదం పెట్టడం వల్లే రెండేళ్లుగా డ్యామ్‌లు అన్నీ నిండుతున్నాయన్నారు. మీ తాత, మీనాన్న ముఖ్యమంత్రులైనా మంగళగిరిలో ఓడిపోయావని లోకేష్‌పై మంత్రి సెటైర్లు వేశారు.