కరోనా అప్డేట్: ఏపీలో కొత్తగా 1,063 పాజిటివ్‌ కేసులు… 16,341 యాక్టివ్‌ కేసులు

Andhra Pradesh has 1,063 new positive corona cases

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 59,198 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,063 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 19,92,774 కి చేరింది. కరోనా కారణంగా చిత్తూరు 4, కృష్ణ 2, తూర్పుగోదావరి 2, గుంటూరు 2, అనంతపూర్ లో ఒక్కరు చొప్పున ​మొత్తం 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,671 కి చేరింది.

Andhra Pradesh has 1,063 new positive corona cases
 

కరోనాబారి నుంచి నిన్న 2,113 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 19,62,762 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 16,341 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2,57,67,609 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే… అనంతపూర్-10, చిత్తూరు-211, ఈస్ట్ గోదావరి-53, గుంటూరు- 104, కడప- 19, కృష్ణ- 103, కర్నూల్- 17, నెల్లూరు-198, ప్రకాశం- 98, శ్రీకాకుళం- 30, విశాఖపట్నం- 61, విజయనగరం- 12, వెస్ట్ గోదావరి-147 చొప్పున కేసులు నమోదయ్యాయి.

గమనిక: కరోనాను కట్టడికి ప్రస్తుతం వాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. భౌతిక దూరం పాటించండి, మాస్క్ ధరించండి, చేతులను శుభ్రంగా శానిటైజ్ చేసుకోండి.