గడిచిన 24 గంటల్లో ఏపీ కరోనా అప్డేట్

Andhra pradesh corona update in last 24 hours

ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 78,992 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 2,058 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 19,63,280 కి చేరింది. కరోనా కారణంగా తూర్పుగోదావరి 2, చిత్తూరు 5, ప్రకాశం 3, కృష్ణ 4, గుంటూరు 2, కర్నూలు 2, విశాఖపట్నం 1, శ్రీకాకుళం 1, నెల్లూరులో ముగ్గురు చొప్పున మొత్తం 23 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,377 కి చేరింది.

Andhra pradesh corona update in last 24 hours

కరోనాబారి నుంచి నిన్న 2,053 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 19,28,723 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 21,180 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2,45,63,043 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. అనంతపూర్-47, చిత్తూరు- 284, ఈస్ట్ గోదావరి-364, గుంటూరు- 182, కడప- 140, కృష్ణ- 325, కర్నూల్- 11, నెల్లూరు-173, ప్రకాశం- 242, శ్రీకాకుళం- 45, విశాఖపట్నం- 89, విజయనగరం- 29, వెస్ట్ గోదావరి- 127, చొప్పున కేసులు నమోదయ్యాయి.

గమనిక: ఎటువంటి సంకోచం లేకుండా ప్రభుత్వం చెప్పిన ప్రకారం, అర్హత ఉన్నవారందరు కోవిడ్ టీకా తప్పక తీసుకోండి. కోవిడ్ టీకా 100% సురక్షితమైనది.