ఆంధ్రాలో రోడ్డెక్కిన పవర్ గ్రిడ్ బాధిత రైతులు

ఆంధప్రదేశ్ లో ఏలూరు నుండి చిలకలూరిపేట వరకు పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  సంస్థ నిర్మిస్తున్న పవర్ లైన్  నిర్మాణాన్ని  వీరులపాడు మండలం వెల్లంకి గ్రామం వద్ద రైతులు అడ్డుకున్నారు.

తమ అనుమతి లేకుండా మా పొలాలలో టవర్లు వేసేందుకు మీకు ఎవరు అనుమతులిచ్చారంటూ అధికారులను నిలదీశారు. 

నష్టపరిహారం విషయంలో రైతులకు అధికారులకు ఏకాభిప్రాయం కుదరక ఏడాది కాలంగా ఈ సమస్య నానుతూ వస్తున్నది. అయితే, ఇపుడు రైతులు అడిగిన  నష్టపరిహారం చెల్లించకుండా, ఈ సమస్యను తేల్చకుండా  లైన్ నిర్మాణానికి అధికారులు పూనుకుని రైతుల ఆగ్రహానికి గురయ్యారు. తమ రైతులకు కాకుండా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారులకు లోకల్ రెవిన్యూ అధికారులు వత్తాసుపలికి పొలాల్లోకి ప్రవేశించడం ఆశ్చర్యం.

రైతులు అడ్డుకున్నప్పటికీ  టవర్ నిర్మిచాల్సిందేనని పట్టుదలగా పవర్ గ్రిడ్  అధికారులు  రెవిన్యూ మరియు పోలీస్ వారి సహాయంతో  మొండిగా రైతుల పొలాలలోకి ప్రవేశించారు .

ఈ పవర్ గ్రిడ్ లైను పూర్తిగా ప్రైవేటు వారిదని రైతులతో నేరుగా పవర్గ్రిడ్ వాళ్లు మాట్లాడిన  నష్ట పరిహారం వ్యవహారం తేల్చుకున్న  తర్వాతే టవర్ నిర్మాణం చేపట్టాలని తమతో  కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం చెప్పినట్లుగా రైతులు చెబుతున్నారు.

అయితే,  ఈ రోజు నందిగామ చందర్లపాడు వీరులపాడు మండలాల తహసీల్దార్లు ఒక్కసారిగా పవర్గ్రిడ్ వాళ్ళని వెంటబెట్టుకొని పొలాల్లోకి ప్రవేశించారు. టవర్ నిర్మాణానికి మార్కింగ్ చేసేందుకు ప్రయత్నించారు.  దానికి తోడు  వేర్లపాడు తాసిల్దార్ ఒకరోజు ముందు నుండే 144వ సెక్షన్ విధించారు. 

రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రైతుల పంట పొలాలలో పవర్గ్రిడ్ కార్పొరేషన్  టవర్లు ఏర్పాటు చేసే విషయమై వీరులపాడు తాసిల్దార్ సరైన విధానం పాటిండం  లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు ఇప్పటివరకు ఎటువంటి నోటీస్ అందలేదని వారంటున్నారు  నిన్న కలెక్టర్  స్వయానా చెప్పినా విషయం ఈరోజు అధికారులు ఖాతరు చేయకుండా పొలాలోకి రావడంతో   పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  నుండి భారీ మొత్తంలో ముడుపులు అందాయని వారు అనుమానిస్తున్నారు.  జిల్లా జాయింట్ కలెక్టర్ సైతం ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

భూసేకరణ చట్టం ఉపయోగించే ముందు   గ్రామాలలో తెలియజేయడం గ్రామసభల ద్వారా అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు ఇక్కడ జరగలేదు..

ఈ పవర్గ్రిడ్ లైన్ గురించి అనేక మార్లు నందిగామ శాసనసభ సభ్యురాలు అధికారుల తోటి చర్చించినప్పటికీ ఫలితం కనిపించలేదు.

సాక్షాత్తు జిల్లా కలెక్టర్ చెప్పిన మాటలు సైతం ఇక్కడి అధికారులు  ఖాతరుచేయడం లేదు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా  పంట పొలాల్లో టవర్లు  నిర్మించేందుకు వచ్చారు.  ఇపుడు మామిడి జామ బత్తాయి వంటి పంటలు వేసి ఉన్నామనీ ఇదంతా నష్టొపోతామని వారు అంటున్నారు.  తమ భూమికి ప్రభుత్వం ఇచ్చే రేటు కు అదనంగా ఐదు రెట్లు నష్టపరిహారం చెల్లిస్తేనే భూమి అప్పగిస్తా మని రైతులు ఖరాకండిగా చెప్పారు.