వైరల్ ఫోటో: ‘యాత్ర’లో అనసూయ ! ఏం క్యారక్టరో తెలుసా

source:twitter

తెలుగు చిత్ర పరిశ్రమ లో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా రూపొందుతున్న బ‌యోపిక్స్‌లో ‘యాత్ర’ఒకటి. తాప్సీతో ఆనందోబ్రహ్మ చిత్రం డైరక్ట్ చేసి హిట్ కొట్టిన మహీ రాఘవ దర్శకత్వంలో ఈ చిత్రాన్నీ 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింంగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అలా పాత్రలో లీనమై దించేస్తున్నారట. వైఎస్సార్ హావభావాలు దగ్గరనుంచి, ఆయన మాట తీరు, ఆయన నడక ఇలా ప్రతి విషయాన్ని ఆయన  వీడియోలు  చూసి …ఎంతో జాగ్రత్తగా అర్ధం చేసుకుంటూ.. వైఎస్సార్ ని గుర్తుకు తెస్తున్నారు అంటున్నారు చిత్ర యూనిట్.

ఇక ఈ చిత్రంలో అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. గత కొద్ది రోజులుగా అనసూయ, మమ్ముట్టి మీద పలు సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ నేఫద్యంలో సెట్ లో దిగిన ఓ ఫోటోను అనసూయ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతూ సోషల్ మీడీయా జనాలను బాగా ఆకట్టుకుంటుంది. అందుతున్న సమాచారం ప్రకారం అనసూయ ..ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తుందని, మహానటిలో సమంత తరహా పాత్ర అని చెప్తున్నారు.

30 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈచిత్రంలో వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రను జగపతిబాబు చేస్తున్నాడు. వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితని సెలక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు, వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణ మురళి, షర్మిళ పాత్ర కోసం భూమిక, సబితా ఇంద్రా రెడ్డి పాత్ర కోసం సుహాసినిని సెలక్ట్ చేసినట్టు తెలుస్తోంది ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ముఖ్యంగా చూపించనున్నారని స‌మాచారం.