హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎబివిపి ఘన విజయం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఘన విజయం సాధించింది. 8 ఏళ్ల తర్వాత యూనివర్శిటీలో ఎబివిపి కీలక స్థానాలు దక్కించుకుని దుమ్ము రేపింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఎబివిపి ప్యానెల్ లో అమ్మాయిలు ఘన విజయం సాధించడం సంచలనం రేపింది. ఎబివిపి ప్యానెల్ అన్ని స్థానాల్లో విజయం సాధించడంతో స్టూడెంట్స్ సంబరాల్లో మునిగిపోయారు. 

సంబరాల్లో ఎబివిపి విద్యార్థులు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ( HCU ) ఎన్నికలలో అన్ని స్థానాలలో ఎబివిపి ఘన విజయం సాధించింది. ఎస్ఎఫ్ఐ ప్యానెల్ పై ఎబివిపి విజయం సాధించింది.  విజయం.

ప్రెసిడెంట్ గా ఆర్తి నగపల్ అనే అమ్మాయి 1663 ఓట్లు సాధించి ఎర్రం నవీన్ ( 1329) పై గెలుపొందారు. 

వైస్ ప్రెసిడెంట్.. అమిత్ కుమార్.. 1505.. పరితోష్ 1258 పై గెలుపొందారు. 

జనరల్ సెక్రటరీ.. ధీరజ్ సంగిజి.. 1573 .. అభిషేక్ కుమార్ 1446 పై గెలుపు.

జాయింట్ సెక్రటరీ.. ప్రవీణ్ కుమార్ 1417.. అనుపమ కృష్ణన్ 1378 పై గెలుపు.

కల్చరల్ సెక్రటరీ.. అరవింద్ ఎస్ కుమార్. 1475.. ప్రకృతి చక్రాబోర్టీ 1242 పై గెలుపు..

స్పోర్ట్స్ సెక్రటరీ.. నిఖిల్ రాన్ 1467.. శామ్యూల్ అనురాగ్ 1328 పై గెలుపు.

8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎబివిపి గెలుపొందడంతో ఎబివిపి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

ఎబివిపి విజయ కేతనం

రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత జరిగిన వివాదాల అనంతరం ఎబివిపి రికార్డు విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో కొత్త చరిత్రను లిఖించే అవకాశం ఉంది. రోహిత్ వేముల మరణంపై అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేశాయి.

ఏకంగా రాహుల్ గాంధీ స్వయంగా యూనివర్శిటీని సందర్శించారు. రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత క్యాంపస్ లో పరిణామాలు మారిపోయాయని అంటున్నారు. 

మొత్తానికి ఈ ఎన్నికలు దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి అనుబంధ సంఘం ఎబివిపి కి కొత్త రక్తం ఎక్కే చాన్స్ ఉందంటున్నారు.