అభినంద్ పక్కన ఉన్న ఆ మహిళ ఎవరంటే

వింగ్ కమాండర్ అభినందన్ విడుదలైన సమయంలో అతని పక్కకు ఉన్న మహిళ ఎవరు అనే చర్చ అందరిలో జరిగింది. అయితే కొందరు అభినంద్ భార్య అని మరికొందరు అభినంద్ వెంట వచ్చిన అధికారి భార్య అనుకున్నారు. సల్వార్ కమీజ్ డ్రెస్సులో ఉన్న ఆ మహిళ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అసలు విషయం ఏంటంటే ఆమె పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె పేరు డాక్టర్ ఫరీహా బుగ్టి.

ఆమె లాహోర్ నుంచి అభినందన్ తో పాటు ఒకే కాన్వాయ్ లో వాఘా వద్దకు చేరుకుని భారత్ కు అప్పగింతల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ముఖం పై చెదురని చిరునవ్వుతో ప్రక్రియ సాఫీగా జరిగేలా చూశారు. డాక్టర్ ఫరీహా ఈ విషయంలోనే కాదు పాక్ చెరలో ఉన్న మరో భారతీయుడు కుల్ భూషణ్ జాదవ్ విచారణలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో కుల్ భూషణ్ ను అతడి కుటుంబ సభ్యులు ఇస్లామాబాద్ లో కలిసినప్పుడు డాక్టర్ ఫరీహా కూడా అక్కడే ఉన్నారు. పురుషుల అధిపత్యం ఎక్కువ ఉండే పాక్ లో డాక్టర్ ఫరీహా విదేశీ వ్యవహారాల నిపుణురాలిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. నెటింజన్లు మొత్తం గూగుల్ లో సెర్చ్ చేశారు.