ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా శ్రీకాకుళం వాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఢిల్లీలో చంద్రబాబు ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్షకు దగ్గరలో అర్జున్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అర్జున్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కింతలి. తాను ప్రత్యేక హోదా కోసమే చనిపోతున్నానని, తన చావుతోనైనా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని సూసైడ్ నోట్ లో అర్జున్ రాసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్జున్ మృతికి సీఎం చంద్రబాబు, శరద్ పవార్ నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామన్నారు. బతికి సాధించాలని ఎవరు కూడా అఘాయిత్యాలకు పాల్పడవద్దని చంద్రబాబు కోరారు.
