టిఆర్ఎస్ ఎంపి కవిత ఘెరావ్ (వీడయో)
టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత కు ఊహించని అనుభవం ఎదురైంది. ఆమె నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో ఆదివారం పర్యటించారు. ఆమె పర్యటనలో ఉండగా రాత్రి సమయంలో పలువురు మహిళలు ఆమెను ఘెరావ్ చేశారు. బోధన్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన తెలంగాణలో సంచలనం రేపింది.
నిజామాబాద్ లో గత 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో టిఆర్ఎస్ గెలుపొందింది. అంతటి విజయం సాధించిన టిఆర్ఎస్ ఈ ఎన్నికల నాటికి ఎదురీదుతున్న పరిస్థితి కనబడుతున్నది. జిల్లాలోని అనేక మంది ఎమ్మెల్యేలు ఎదురీదుతున్నారు. వారికి ప్రచారంలో జనాలు, కాంగ్రెస్ కార్యకర్తలు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాజాగా బోధన్ లో ఎంపి కవితకు కూడా ఇటువంటి నిరసన తప్పలేదు. అయితే బోధన్ లో ఎంపి కవితను ఘెరావ్ చేసిన ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కవితను ఘెరావ్ చేసిన ఘటనకు సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.