వైఎస్‌ వివేకానందరెడ్డి కన్నుమూత!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి(68) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయిన వైఎస్‌ వివేకానందరెడ్డి పులివెందులలో మృతిచెందారు. గతంలో మంత్రిగా, ఏంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి పనిచేశారు. 1989,1994లలో పులివెందుల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004 లో ఆయన కడప లోక్‌సభకు కూడా ప్రాతినిథ్యం వహించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి మరణంతో పులివెందులలో విషాదఛాయలు అలుముకున్నాయి.