పరారీలో టిడిపి మాజీ ఎంఎల్ఏలు

ఇద్దరు మాజీ ఎంఎల్ఏలు పరారీలోనే ఉన్నారు. తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నపుడు ఎంఎల్ఏలుగా ఉన్న వీరిద్దరూ తమ నియోజకవర్గాల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరిలో మళ్ళీ చింతమనేని ప్రభాకర్ రూటే సపరేటుగా చెలరేగిపోయారు.

సీన్ కట్ చేస్తే టిడిపికి మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. అయితే అధికారంలో ఉన్నపుడు చేసిన అరాచకాలు, దాష్టికాలు ఆగిపోలేదు. అధికారంలో ఉన్నపుడు ఎలాగైతే చెలరేగిపోయారో ఇపుడు కూడా అదే దారిలో నడిచారు. దాంతో పోలీసు కేసులవ్వటంతో అరెస్టు నుండి తప్పించుకోవటానికి పరారీలో ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మాజీ ఎంఎల్ఏ కూన రవికుమార్ ఓ ఎంపిడివోపై నోటికొచ్చినట్లు తిట్టారు. చంపేస్తానని బెదిరించిన వీడియో వైరల్ అయ్యింది. దాంతో ఉద్యోగులు కూనకు వ్యతిరేకంగా ఆందోళన మొదలుపెట్టారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక చింతమనేని ఓ ఎస్సీ వ్యక్తిపై దాడి చేశారట. దాంతో బాధితుడు పోలీసు స్టేషన్లో పెట్టిన కేసుతో చింతమనేనిని పోలీసులు అరెస్టు చేసేందుకు రెడీ అయ్యారు. వెంటనే ఈ మాజీ కూడా పరారయ్యారు. విచిత్రమేమిటంటే అధికారంలో ఉన్నపుడు ఇదే చింతమనేని ఎవరిని పడితే వాళ్ళని కొట్టేవారు. అధికారులను అమ్మనాబూతులు తిట్టిన ఘటనలకు లెక్కేలేదు.