ఢిల్లీని తాకేలా మూడు రాజధానుల ఉద్యమం

రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఏర్పాటు చేయనున్న మూడు రాజధానుల నిర్ణయం వల్ల జరిగే మంచి పరిణామాలు ఏమిటి ? ప్రజా ప్రయోజనాలకోసమే ఈ నిర్ణయం అందుకే దీన్ని ఢిల్ల్లీ పెద్దలకు తెలిసేదిశగా ఉద్యమం చేపడుతున్నట్టు ఎపి మంత్రి కన్నబాబు అన్నారు. మూడు రాజధానుల ఉద్యమం గురించి ఢిల్లీ కి తెలిసేలా పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ, సహకారాల శాకా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ఈ విషయం పై రాష్ట్రపతికి కోటికి పైగా పోస్టు కార్డులు రాయనున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి, అప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అదే దీని ప్రధాన ఉద్దేశం అని అన్నారు అయన. అయితే మాజీ ముఖ్యమంత్రి ఈ విషయంలో అడ్డు తగులుతున్నదని, శాసన మండలి రద్దు విషయంలో కూడా డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. చంద్రబాబు తీరుపై ప్రజలంతా చాలా కోపంతో ఉన్నారని కన్నబాబు తెలిపారు.