అనంతపురం జిల్లాలో కరోనా??

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ఇప్పుడు కరోనా కలకలం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదైందన్న వార్తలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలంలో కరోనా కలకలం రేగింది.

పరకులవాండ్లపల్లికి చెందిన గ్రామస్తులు అంబులెన్స్‌కు ఫోన్ చేసి అబ్దుల్ జాఫర్(55) అనే వ్యక్తికి కరోనా ఉందని చెప్పారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖా సిబ్బంది ఆయనను కదిరి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. హైదరాబాద్ నుంచి పరకులవాండ్లపల్లికి వెళ్లిన జాఫర్‌కు వీపరీతంగా తమ్ములు, దగ్గులు రావడంతో స్థానికులంతా అతనికి కరోనా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే గ్రామస్థులంతా కలిసి జాఫర్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అబ్దుల్ జాఫర్‌కు ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పరీక్షలు నిర్వహిస్తున్నారు.