అన్ స్టాపబుల్ సీజన్ 2 రెండవ ఎపిసోడ్ గెస్ట్ గా స్టార్ హీరోలు.. క్లూ ఇచ్చిన ఆహా?

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ఆహాలో ప్రసారమై మంచి ప్రేక్షకుదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ అన్ స్టాపబుల్ టాక్ షో సీజన్ 1 పూర్తి చేసుకొని.. తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ప్రారంభమైంది. అక్టోబర్ 14వ తేదీన ప్రారంభమైన స్థాపకులు సీజన్ 2 లో బాలకృష్ణ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మునుపటి కంటే మరింత ఎక్కువ ఉత్సాహంతో షో ని ప్రారంభించాడు. ఇక ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో మొదటి గెస్ట్ గా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అతని తనయుడు నారా లోకేష్ హాజరయ్యారు.

ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ తన బావ అల్లుడితో వ్యక్తిగత విషయాల గురించి మాత్రమే కాకుండా రాజకీయపరమైన విషయాలను కూడా చర్చించారు. ఈ క్రమంలో మొదటి ఎపిసోడ్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. దీంతో ఈ సీజన్ 2 లో రెండవ గెస్ట్ గా హాజరయ్యే సెలబ్రెటీ గురించి ప్రేక్షకులలో చర్చలు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో ఆహా యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్ ద్వారా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ షేర్‌ చేసి రెండవ ఎపిసోడ్ లో పాల్గొనె సెలబ్రిటీ గురించి గెస్ చేయమని ప్రేక్షకులకు పరీక్ష పెట్టింది.

ఈ క్రమంలో ‘గెస్‌ ది గెస్ట్ ఆఫ్‌ ఎపిసోడ్‌-2’ అంటూ తర్వాతి ఎపిసోడ్‌కు వచ్చే గెస్టులెవరో గెస్‌ చేయండంటూ ఆహా యాజమాన్యం రెండు పజిల్స్‌ను షేర్‌ చేసింది . ఈ రెండు పజిల్స్ లో మొదటి పజిల్‌ను పరిశీలిస్తే డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి ఈ షోకు రెండవ ఎపిసోడ్లో గెస్ట్ గా వస్తున్నారని అర్థమవుతుంది. ఇక రెండో పజిల్‌ చూస్తే కొంత క్లిష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ కొంతమంది నెటిజన్స్ పజిల్ సాల్వ్ చేసి రెండవ ఎపిసోడ్లో గెస్ట్ గా హాజరయ్యే మరొక సెలబ్రిటీ హీరో విశ్వక్ సేని అని కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం సిద్దూ జొన్నల గడ్డ అని కామెంట్స్ చేస్తున్నారు.