సుడిగాలి సుధీర్ యాంకర్ గా సరికొత్త కామెడీ షో… ఆహా ప్లాన్ మామూలుగా లేదుగా!

బుల్లితెర మీద ప్రసారమవుతున్న కామెడీ షో అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు జబర్దస్త్. 2013లో ప్రారంభమైన ఈ కామెడీ షో గత తొమ్మిది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రసారమవుతు.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా ఎంతోమంది కమెడియన్స్ ని ఇండస్ట్రీకి అందించింది. ఇలా జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పాపులర్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. జబర్దస్త్ కామెడీ షోలో టీం లీడర్ గా అద్భుతమైన స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా యాంకర్ రష్మి తో ప్రేమాయణం నడిపి బాగా పాపులర్ అయ్యాడు.

ఇలా జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాలలో హీరోగా నటించే అవకాశాలు కూడా అందుకున్నాడు. ఇలా ఎన్నో సంవత్సరాలుగా ఆకట్టుకున్న సుధీర్ కొంతకాలం క్రితం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి కూడా దూరమయ్యాడు. అయితే సినిమా అవకాశాలు రావడంతో సుధీర్ జబర్దస్త్ కి దూరమయ్యాడని అందరూ భావించారు. కానీ సుధీర్ మాత్రం మాటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోలో యాంకర్ గా సందడి చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం మాటీవీలో ప్రసారమవుతున్న షోలో పూర్తి కావడంతో కొన్ని రోజులుగా సుధీర్ ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక సుధీర్ పని అయిపోయిందని చాలామంది భావించారు.

కానీ సుధీర్ సరికొత్త కామెడీ షో ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ప్రముఖ ఓటిటి ఛానల్ ఆహా వేదికగా ప్రసారం కానున్న కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కామెడీ షో లో యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేయటానికి సుధీర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జబర్దస్త్ కామెడీ షో కి ధీటుగా ఒక్క షో కూడా నిలవలేకపోయాయి. దీంతో ఎలాగైనా జబర్దస్త్ కామెడీ షో ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఆహా యాజమాన్యం ఈ సరికొత్త కామెడీ షో కి రంగం సిద్ధం చేసింది. ఇక ఈ షోలో సుధీర్ యాంకర్ గా వ్యవహరించగా.. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరించనున్నాడు. ఇక జబర్దస్త్ నుండి బయటికి వచ్చిన కమెడియన్లు అందరూ కూడా ఈ షోలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా జబర్దస్త్ మాజీ కంటెస్టెంట్లతోనే జబర్దస్త్ కు చెక్ పెట్టాలని ఆహా పెద్ద స్కెచ్ వేసింది.