రష్మీ ఛీ కొట్టడంతో వర్షతో రొమాన్స్ మొదలు పెట్టిన సుధీర్… అయోమయంలో ఇమాన్యుల్!

సుడిగాలి సుధీర్.. ఈ పేరు గురించి తెలియని వారంటూ ఉండరు. మెజీషియన్ గా తన కెరీర్ ప్రారంభించిన సుధీర్ జబర్దస్త్ లో అవకాశం దక్కించుకొని టీం లీడర్ గా మంచి గుర్తింపు పొందాడు. ఇక జబర్దస్త్ యాంకర్ రష్మీ తో లవ్ ట్రాక్ నడిపి మరింత ఫేమస్ అయ్యాడు. ఇలా చాలా కాలంగా జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ షో లలో తన కామెడీ తో పాటు రష్మితో కలిసి రొమాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సుధీర్ కొంతకాలం క్రితం జబర్దస్త్ కి దూరమయ్యాడు. ఈ క్రమంలో మాటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరించడంతో ఇక సుధీర్ ఈటీవీ కి పూర్తిగా దూరమయ్యాడని వార్తలు వినిపించాయి.

అయితే ఇటీవల మళ్ళీ ఈటీవీలో రీఎంట్రీ ఇచ్చిన సుదీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో కూడా సందడి చేస్తున్నాడు. ఇక వచ్చేవారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఈ ప్రోమోలో సుధీర్ రాంప్రసాద్ తో కలిసి స్కిట్ చేసి అందరిని నవ్వించాడు. ఇక స్కిట్ లో భాగంగా డైరెక్టర్ రష్మికి ప్రపోజ్ చేయమని చెప్పగా ..`నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ, నువ్వే ఏడిస్తే నేను చచ్చిపోతా` అని తన పాపులర్‌ డైలాగ్‌ని చెప్పాడు. దీంతో చావు రా చావు అంటూ రష్మి రిజెక్ట్ చేసింది.

ఇక జబర్దస్త్ ఫేమస్ అయిన ఇమాన్యుల్ వర్ష మధ్య సుధీర్ చిచ్చుపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ ప్రోమో లో వర్ష ఇమాన్యుల్ పెళ్లికి ఫోటోగ్రాఫర్ గా వచ్చిన సుధీర్ వర్షాన్ని లైన్లో పెట్టే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో వర్ష తో కలసి డాన్స్ చేయడమే కాకుండా నాతో వస్తావా అంటూ పాట కూడా పాడాడు. వర్ష తో కలిసి సుధీర్ చేసే రొమాన్స్ చూసిన ఇమాన్యుల్ ఫ్రస్టేషన్లో ఈ పంచాయతీ ఒక్క నువ్వే కట్టుకొని నువ్వే పెళ్లి చేసుకో అంటూ సుధీర్ మీద దాడికి దిగాడు. ఇలా సుధీర్ వచ్చి రాగానే వర్ష తో రొమాన్స్ చేయడంతో ఇమాన్యుల్ కోపంతో ఊగిపోయాడు. వీరిద్దరి రొమాన్స్ చూస్తూ అయోమయంగా మళ్లీ ఎందుకు వచ్చావురా అంటూ సుధీర్ మీద సీరియస్ అయ్యాడు.