ఢీ స్టేజ్ మీద శ్రద్దా దాస్ కి అవమానం.. కన్నీళ్ళు పెట్టుకున్న హీరోయిన్…?

ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. దేశంలో అన్ని భాషలలో ప్రసారం అవుతున్న డీ డాష్ షో తెలుగులో కూడా కొన్ని సంవత్సరాలుగా ప్రసారమవుతుంది. ప్రస్తుతం ఢీ14 సీజన్ జరుగుతుంది. ఈ సీజన్ లో గణేష్ మాస్టర్ శ్రద్ధాదాస్ శ్వేతా నందిత జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే ఈ షో లో ప్రదీప్ తన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ షోలో ఆది, రవి కిరణ్, నవ్య స్వామి , ప్రాంక్ స్టార్ కిరణ్ మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే మునుపటితో పోల్చితే ఢీ షో రేటింగ్స్ కూడ దారుణంగా పడిపోయాయి . ఢీ, జబర్దస్త్ వంటి రియాలిటీ షో ద్వారా రేటింగ్స్ పెంచడానికి మల్లెమాల ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలో చాలా సందర్భాలలో ఫ్రాంక్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేశారు. కాకపోతే ప్రతిసారి ఇలా ఫ్రాంక్ చేయటంతో ప్రేక్షకులు కూడా విసుగు చెందారు. అయితే తాజాగా విడుదలైన ఢీ డాన్స్ ప్రోమోలో హీరోయిన్ శ్రద్దా దాస్ , మెంటర్ కిరణ్ కి మద్య గొడవ జరిగింది. ఈ వారం కొరియోగ్రాఫర్ స్పెషల్ దాంట్లో భాగంగా కంటెస్టెంట్లతో పాటు కొరియోగ్రాఫర్లు కూడా పర్ ఫామ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక డాన్స్ మాస్టర్ చేసిన డాన్స్ నచ్చటంతో సరదాగా వెళ్లి అతనితో కలిసి డాన్స్ చేసింది. ఈ క్రమంలో కిరణ్ మాట్లాడుతూ.. ఇలా పక్షపాతం చూపించడం సరైనది కాదని గొడవకు దిగాడు.

ఈ విషయంపై ప్రదీప్ క్లారిటీ ఇవ్వటానికి ప్రయత్నించగా అతను ప్రదీప్ మీద కూడా ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలో శ్రద్దా దాస్ కూడా మీరు కొంచం సౌండ్ తగ్గించి మాట్లాడండి అని అంటే నేనేం చేయాలో మీరు నాకు చెప్పనవసరం లేదు అంటూ అందరిముందు అంతాను శ్రద్దా దాస్ ని అవమానించాడు. దీంతో ఆమె స్టేజ్ దిగి వెళ్ళిపోయి కన్నీళ్ళు పెట్టుకుంది. అయితే ఆది కూడా కిరణ్ కి నచ్చచెప్పాలని చూసినా కూడా మీ జోకులు నా దగ్గర వేయకండి బ్రో అంటూ ఆది మీద కూడా సీరియస్ అయ్యాడు. దీంతో సెట్ నుండి అతనిని బయటికీ తీసుకెళ్లినట్లు ఈ ప్రోమోలో చూయించారు. దీంతో మరొకసారి ఫ్రాంక్ చేశారా అంటూ ప్రేక్షకులు విసుగు చెందారు .