కొడుకుగా తల్లికి సేవలు చేస్తున్న రిషి… సంతోషంలో మహేంద్ర వసుధార!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తూ కుటుంబ కథ నేపథ్యంలో కుటుంబ విలువలను తెలియజేస్తూ ప్రసారమవుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. అయితే నేడు ఈ సీరియల్ మరింత ఉత్కంఠ భరితంగా కొనసాగనుంది. యాక్సిడెంట్ అయినా అనంతరం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నటువంటి జగతికి రిషి బ్లడ్ ఇచ్చి తన ప్రాణాలను కాపాడుతారు.ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా మహేంద్ర ఏంటి గౌతమ్ ఇలా జరిగింది అంటూ బాధపడుతూ ఉండగా మరేం కాదు అంకుల్ మీరు భయపడకండి డాక్టర్లు కూడా ఏలాంటి ప్రమాదం లేదని చెప్పారు అంటూ గౌతమ్ మహేంద్రకు ధైర్యం చెబుతాడు.

మరోవైపు రిషి జగతికి బ్లడ్ ఇస్తూ ఉండగా వసుధారా జగతి వైపు చూస్తూ నేను మిమ్మల్ని కలపడం ఏంటి మేడం రక్తసంబంధం మిమ్మల్ని కలుపుతోంది. మీ అబ్బాయి మీకు రక్తం ఇచ్చి కాపాడుకుంటున్నారు అంటూ మనసులో ఎమోషనల్ కాగా రిషి వసుధార చేతిని పట్టుకొని ఎందుకు ఏడుస్తున్నావ్? మేడంకి ఏం కాదు అంటూ ధైర్యం చెబుతాడు. అంతలోగా నర్స్ వచ్చి వసుధారను బయటకు వెళ్ళమని చెబుతుంది.వెళ్తూ వెళ్తూ పసుధార జగతి దగ్గరకు వెళ్లి మీ అబ్బాయి మీకు రక్తం ఇచ్చి కాపాడుకుంటున్నారు మీకేం కాదు మేడం మీరు త్వరగా కోలుకొని రావాలి కొడుకుగా తన బాధ్యత నెరవేరుస్తున్నాడు అంటూ చెప్పి వెళ్తుంది.

ఇక బయట మహేంద్ర గౌతమ్ జగతి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు. అదే సమయంలో గౌతం టీ తీసుకురాగా తనకేమీ వద్దు అని మహేంద్ర చెప్పగా అంతలో వసుధారా అక్కడికి వెళుతుంది. అనంతరం ఋషి బ్లడ్ ఇవ్వడం పూర్తి కాగా జగతి వైపు చూస్తూ ఎమోషనల్ గా తను అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.ఆ సమయంలో జగతి రిషి అంటూ కలవరించగా రిషి తన వద్దకు వెళ్లి ఎమోషనల్ గా మీకు ఏమి కాదు మేడం ఏమి కానివ్వను అంటూ ధైర్యం చెబుతాడు.

ఇక రిషి బయటకు వెళ్తుండగా జగతి రిషి చేతిని పట్టుకొని కలవరిస్తూ ఉండగా రిషి దగ్గరకు వెళ్లి తన కళ్ళల్లో నీటిని తుడిచి మీకు స్పృహ లేకపోయినా నేను అన్న మాటలు మీ మనసుకు చేరాయని అనుకుంటున్నాను మీరు డాడ్ ఆనందంగా ఉండడమే నాకు కావాలి అని చెబుతుండగా జగతి నేను మహేంద్ర నీ దగ్గరకు వస్తున్నాం రిషి అంటూ కలవరిస్తుంది. అప్పుడు రిషి జగతి తలని నిమురుతూ మీకు ఏం కాదు మేడం అని ధైర్యం చెప్పి బయటకు వెళ్తుండగా
జగతి దాహం దాహం అని కలవరిస్తుంది.

రిషి తనకు నీళ్లు తాగించి కొడుకుగా తన తల్లికి సేవలు చేస్తూ ఉంటాడు ఇది చూసిన మహేంద్ర వసుధార గౌతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అనంతరం దేవయాని ఫణీంద్ర వస్తారు.ఇక బయటకు వెళ్లిన ఋషి ఒకసారిగా మహేంద్ర ను కౌగిలించుకొని తాను బయటకు వెళ్లడానికి కారణం చెబుతుండగా ఇప్పుడు నాకేమీ చెప్పద్దు మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అంటూ ఎమోషనల్ అవుతారు.