బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళిన మూడు రోజులకే ఏడ్చేసిన రేవంత్…?

ఎంతో కాలంగా ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న బిగ్బాస్ సీజన్ 6 ఎట్టకేలకు ప్రారంభం అయింది. సెప్టెంబర్ నాలుగవ తేదీ ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. అయితే బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్లు అప్పుడే తమ ఆట షురూ చేసినట్లు కనిపిస్తోంది. ఇక బిగ్‌బాస్‌ కూడా క్లాస్‌.. మాస్‌.. ట్రాష్‌ అంటూ ఇంటి సభ్యులకు ఒక టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్ లో క్లాస్‌వాళ్లకు అన్ని అధికారాలు ఉంటాయి. వీరు ఇంటిసభ్యులతో ఏ పనులైనా చేయించుకునే అవకాశం బిగ్ బాస్ కల్పించాడు. ఈ క్రమంలో ట్రాష్‌లో ఉండే గీతూ క్లాస్‌లోకి రాగానే వచ్చీరావడంతోనే ఇంటి సభ్యులకు పనులు పురమాయించి.

ఈ క్రమంలో ఇనయ సుల్తానా తో సపర్యలు చేయించుకుంది. అంతే కాకుండా తనికి రైమ్స్ పాడమని ఆర్డర్ వేసింది. అయితే ఇనయా మాత్రం బిగ్ బాస్ కేవలం పనులు చేయమని చెప్పాడు పాటలు పాడమని చెప్పలేదంటు సమధానం చెప్పింది. ఇక ఇటీవల బిగ్ బాస్ నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కూడా విడుదల అయ్యింది. ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ కొత్త టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ కన్నీరు పెట్టుకున్నాడు. ఏం పరిస్థితి తెచ్చవురా స్వామి బిగ్ బాసు అంటూ బాధ పడ్డాడు. ఇక ఎపిసోడ్ లో మెరీనా తను చెప్పిన మాట వినిపించుకోలేదని భర్త రోహిత్‌ పై కస్సుబుస్సులాడింది ఇక రోహిత్ సారీ చెప్పినా కూడా మెరీనా అవసరం లేదంటూ విసురుగా వెళ్లిపోయింది. దీంతో రోహిత్‌ అన్నింటికీ ఓవరాక్షన్‌ అంటే వెళ్లిపో అని సీరియస్ అయ్యాడు.

ఇక మరొక సందర్భంలో ఎవరికి వాళ్లు మేమే లీడర్స్‌ అని ఫీలవుతున్నారని గీతూ తన అభిప్రాయం బయటపెట్టింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కోసం నేహా , ఇనయా ఇద్దరు పోటీ పడ్డారు. ఈ టాస్క్ లో నేహా శర్మ గెలవగా ఇనయ ఓడిపోయింది. దీంతో నాకు ఎవరు సపోర్ట్ చేయరనే విషయం నాకు అర్థమైంది అంటూ నేహా అక్కడే నుండి వెళ్ళిపోయింది మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు కొనసాగటం కోసం ప్రతి ఒక్కరు గట్టిగానే కష్టపడి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.