నమ్మిన వారే మోసం చేస్తున్నారు..బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి బాలాదిత్య భార్య సంచలన వ్యాఖ్యలు..?

బాల నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా మారిన బాలాదిత్య గురించి తెలియని వారంటూ ఉండరు. హీరోగా చాలా సినిమాలలో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడంతో సినిమాలకు దూరమయ్యాడు. ఇక ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం దక్కించుకొని మళ్లీ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా గుర్తింపు పొంది మళ్లీ సినిమాలలో రీఎంట్రీ ఇవ్వాలన్న ఉద్దేశంతో బాలాదిత్య ఈ రియాలిటీ షోలో అడుగు పెట్టాడు.

బిగ్ బాస్ హౌస్ లో బాలాదిత్య చాలా సౌమ్యంగా ఉంటూ అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాడు. బాలాదిత్య ప్రవర్తనకి కొంతమంది నెటిజన్స్ ప్రశంసిస్తుంటే మరి కొంతమంది మాత్రం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల బాలాదిత్య భార్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ ఇంటర్వ్యూలో ఈవిడ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించడమే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈ క్రమంలో ఆవిడ మాట్లాడుతూ..ఆదిత్య ఇంట్లో ఎలా ఉంటాడో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉన్నాడు. ఆదిత్య మొదటి నుంచి చాలా సౌమ్యుడు. అందువల్ల కంటెస్టెంట్ల దగ్గర కూడా చాలా సౌమ్యంగా ఉంటున్నాడు అంటూ చెప్పుకొచ్చింది. కానీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో కొంతమంది కంటెస్టెంట్లు ఆదిత్యతో మంచిగానే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన మంచితనాన్ని వాడుకుంటూ ఆయన్ని మోసం చేస్తున్నారని బాధపడింది. ఇక బాలాదిత్య మీద తనకు చాలా నమ్మకం ఉందని ఖచ్చితంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచి బిగ్ బాస్ టైటిల్ దక్కించుకుంటాడని ధీమా వ్యక్తం చేసింది.