అప్పుల బాధతో అమ్మ ఆత్మహత్య చేసుకుంది: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ షో రసవత్తరంగా సాగుతోంది. ఇటీవల మొదలైన ఈ షో అప్పుడే రెండవ వారంలోకి అడుగు పెట్టింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, పోట్లాటలు, ఏడుపులతో మరింత రసవత్తరంగా సాగుతోంది. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన సిసింద్రీ స్కిట్ అయితే కొట్లాటలు అరుపులు ఏడుపులతో సాగింది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి కన్నీటి గాథ విని పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. అవి ఏదో ఒక రోజు తొలగిపోతాయి అప్పటివరకు సహనంగా వేచి చూడాలి అని తెలిపారు ఆదిరెడ్డి.

తాజాగా బిగ్ బాస్ హౌస్ లో జీవితంలో జరిగిన ఒక బాధాకరమైన ఘటన గురించి చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. తన తల్లి అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకొని మరణించింది అని చెప్పడంతో అక్కడున్న చాలామంది కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. మా అమ్మ తక్కువ హైట్ ఉన్న బాత్రూంలో ఉరివేసుకొని చనిపోయారు. ఆ బాత్రూం చూసిన ప్రతిసారి అంత తక్కువ హైట్ లో ఉన్న బాత్రూంలో ఎంత ఇబ్బందులు పడి మా అమ్మ చనిపోయింది అన్న బాధ కలుగుతుంది అని తెలిపాడు ఆదిరెడ్డి. ఇక జీవితంలో బాధలు తీరవు ఇదే నా జీవితం ఇంతే అనుకొని బాధపడి మా అమ్మ 2013లో ఆత్మహత్య చేసుకుంది.

అప్పటినుంచి సరిగ్గా ఐదేళ్లకు 2018లో నేను సక్సెస్ అయ్యాను కానీ ఆ రోజు మా అమ్మ నాతో లేదు అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు ఆదిరెడ్డి. మా అమ్మ చనిపోయిన రోజు నాటికి కనీసం మా అమ్మకు బంగారు గొలుసు కూడా ఉండేది కాదు. ఏదైనా ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు బంధువుల నగలు పెట్టుకుని వెళ్ళేది. ఇప్పుడు కనుక ఆమె ఉంటే నేను ఆమెకు కావాల్సినంత బంగారు చేపించే వాడిని అని చెప్పుకొని ఎమోషనల్ అయ్యాడు ఆదిరెడ్డి. ఆదిరెడ్డి మాటలు విన్న చాలా మంది కంటెస్టెంట్లు కన్నీరు పెట్టుకున్నారు.