వంటలక్క పై సీరియస్ అయిన కార్తీక్…. డాక్టర్ చారుశీలను కలిసిన సౌందర్య!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఒకే కథతో కొనసాగిస్తూ అనేక ట్విస్టులతో ప్రసారమయ్యే పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే…ఒకవైపు కార్తీక్ తల్లి మరో వ్యక్తి తన కూతురు ఇద్దరు కూడా కోసం వెతుకుతున్నారని తెలియగానే కార్తీక్ ఎంతో బాధపడతారు.అదే సమయంలోనే చారుశీల నిజం దాచి తప్పు చేస్తున్నవేమో వారికి నిజం చెప్పడమే మంచిది అంటూ సలహా ఇస్తుంది.ఇప్పుడు వాళ్లకు నిజం చెప్పితే వాళ్లు తట్టుకోగలరా ఎప్పుడైతే దీప గుండె ఇవన్నీ స్వీకరించగలదు అని తెలిసినప్పుడే తనకు అన్ని నిజాలు చెబుతానని కార్తీక్ అంటాడు.

మరోవైపు దీప జరిగిన విషయాల్లో తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అనంతరం పండరి మాట్లాడించడంతో చూసావా పండరి పొద్దున ఉన్నవాళ్లు సాయంత్రానికి లేరు అంటే వాళ్ళు మనకు కనిపించకపోయినా మన ప్రతి ఒక్క కదలికను వాళ్లు గమనిస్తూనే ఉన్నారు అంటూ బాధపడుతుంది.అంతలో కార్తీక్ అక్కడికి రావడంతో నేను వంట చేసి రెడీగా పెట్టాను మీరిద్దరూ తిని టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పడంతో నేను వేస్తానని కార్తీక్ చెబుతాడు. ఇక దీప అదే దశలో ఉంటే ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయాలని కార్తీక్చూసినప్పటికీ అదే విషయం గురించి దీప ఆలోచిస్తూ ఉండడంతో నిజం చెప్పాలని డిసైడ్ అవుతాడు మరోవైపు సౌందర్య సౌర్య గురించి కార్తీక్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది.

శౌర్యకు తన అమ్మానాన్నలు బతికే ఉన్నారని అనుమానం ఎందుకు కలిగింది అని ఆలోచిస్తూ వెంటనే దానిని కలిసి ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటుంది అప్పుడే డ్రైవర్ అంజితో కార్తీ వెంటనే బయటికి వెళ్లాలని చెప్పి వెళ్తారు. మరోవైపు దీప కార్తీక్ ఒడిలో పడుకుని సౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది.కార్తీక్ మాట్లాడుతూ పండరి చెప్పింది విన్నావు కదా దీప వాళ్లు మనకు బిడ్డని ఇవ్వకుండా దూరంగా వెళ్లారు అంటే వాళ్లకు మన సౌర్య పై ఎంత ప్రేమ ఉందో. వాళ్లు సౌరిని బాగా చూసుకుంటారేమో అని కార్తీక్ చెప్పినప్పటికీ దీప మాత్రం తన కూతుర్ని ఎలాగైనా తెచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది.

కార్తీక్ అని చెప్పిన దీప వినకపోకుండా వాళ్లు నాకు పాపను దూరం చేస్తారేమోనని బాధపడుతూ ఉండగా కార్తీక్ మాత్రం మీ ఆరోగ్యం బాగుండాలి కదా అని మనసులో అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు.అది చూస్తున్న దీప ఏమైంది మీరు నా దగ్గర ఏంటి దాస్తున్నారు అని అడగడంతో దాయడానికి ఏమీ లేదని చెబుతాడు.ఇతరు కలిసి భోజనం చేయగా దీప తిన్న ప్లేట్ కూడా కార్తీక్ తీస్తానని చెప్పడంతో అసలు ఏమైంది డాక్టర్ బాబు నాకు నిజం చెప్పండి అంటూ నిలదీయడంతో కార్తీక్ కోపంతో ప్లేట్ విసర కొట్టి ఏమి కాలేదు అని చెబుతున్నాను కదా మాటకు ముందు ఒకసారి మాటకు వెనుక ఒకసారి నాకేమైంది నాకేమైంది అంటూ విసిగిస్తావని తనపై సీరియస్ అవుతాడు.

ఇలా కార్తీక్ సీరియస్ కావడంతో దీపం మౌనంగా ఉంటుంది మరోవైపు సౌందర్య చారుశీలకు ఫోన్ చేసి తనని ఒకచోట కలవాలని చెప్పడంతో చారుశీల ఇదే విషయాన్ని కార్తీక్ కి చెప్పగా కార్తీక్ ఇప్పుడే వస్తున్నానని చెబుతాడు.దీంతో దీప కూడా ఇక్కడ నాకు ఎలాగో ఉంది నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పగా కార్తీక్ తనకు ఏదో ఒకటి చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు అయితే అప్పటికే సౌందర్య చారుశీల ఇద్దరు మాట్లాడుతూ ఉండగా కార్తీక్ చాటుగా వింటూ ఉంటాడు.