దీప పరిస్థితి తలుచుకొని ఎమోషనల్ అయిన కార్తీక్…. కార్తీక్ కోట్ల ఆస్తి పై కన్నేసిన చారుశీల!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే.. చాటుగా దీప, కార్తీక్ ఇద్దరు కూడా తమ తల్లిదండ్రులు ఉన్న ఇంటిని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో దీప ప్రమాదంలో నేను చనిపోయానని చెప్పి మీరు వెళ్ళండి.మరి కొద్ది రోజులలో ఎలాగో నేను చనిపోతాను కదా మీరైనా బ్రతికి ఉన్నారు అని తెలిస్తే వాళ్ళు సంతోషపడతారని దీప చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు.నాకు మొత్తం నిజం తెలిసిపోయింది నువ్వు చారుశీల మాట్లాడుకున్నప్పుడు నేను అంతా విన్నాను అని చెప్పడంతో కార్తీక్ బాధపడతాడు

ఇక సౌందర్య హేమచంద్ర ఇంటి నుంచి వెళ్లిపోవడంతో హేమచంద్ర అక్కడికి వచ్చి మీకోసం మీ అమ్మ ఎంత బాధ పడుతుందో తెలుసా ఆమె బాధ చూసైనా మీ మనసు కరగలేదా అనడంతో అమ్మని చూసి హత్తుకొని గట్టిగా ఏడవాలని ఉంది కానీ నా పరిస్థితుల వల్ల వెళ్లలేకపోతున్నామని కార్తీక్ చెబుతాడు.ఇక హిమ తన తల్లిదండ్రుల ఫోటో చేతిలో పట్టుకొని అందరిని అడుగుతూ ఉంటుంది. ఎవరు కూడా వాళ్లను చూడలేదని చెప్పడంతో హిమ అలసిపోయి ఒకచోట కూర్చుంటుంది. అదే సమయంలోనే పండరి రోడ్డుపై నడుస్తూ వస్తుండగా కూరగాయలు కింద పడిపోతాయి. తననైనా అడుగుదామని హిమ వెళ్లడంతో అప్పటికే పండరి వెళ్ళిపోతుంది.

మరోవైపు కార్తీక్ టాబ్లెట్స్ వేసుకోమని చెప్పగా ఆగిపోయే ఈ గుండెకు టాబ్లెట్స్ ఎందుకు డాక్టర్ బాబు ఒకవేళ నన్ను బ్రతికించుకునే అవకాశం ఉంటే మీరు ఇలా ఉండరు కదా అని చెప్పి బాధపడుతుంది. కార్తీక్ సైతం అలా మాట్లాడకు దీపా ఎలాగైనా నిన్ను బ్రతికించుకుంటాను అని తనకు ధైర్యం చెబుతాడు.దీప మాత్రం తాను చనిపో బోతున్నానని తెలిసి బాధపడుతూ నేను చనిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు మీరు అత్తయ్య పిల్లల దగ్గరికి వెళ్లిపోండి అని చెప్పడంతో లేదు దీప నువ్వెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను. నీతో కలిసి జీవితం పంచుకోలేదు కనీసం చావున పంచుకొనివ్వు అంటూ ఇద్దరు బాధపడతారు. దూరం నుంచి దీప పరిస్థితి తెలుసుకున్నటువంటి పండరీ ఎమోషనల్ అవుతూ దీపమ్మను నిండు నూరేళ్లు బ్రతికించు దేవుడా అని బాధపడుతుంది.

మరోవైపు సౌందర్య వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా ఇంద్రుడు చంద్రమ్మ కింద కూర్చొని భోజనం చేస్తారు. వాళ్ళని కూడా వచ్చి డైనింగ్ టేబుల్ పై కూర్చొని భోజనం చేయమంటుంది. కానీహిమ మాత్రం తన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ నాకేమీ నచ్చలేదు అనడంతో శౌర్య మాత్రం మా పిన్ని బాబాయ్ ఇక్కడ కూర్చుని తినడం నీకు నచ్చలేదా అసలు ఏం బుద్ధి నీది అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది.మరోవైపు చారుశీల ఆలోచిస్తూ కార్తీక్ ఇద్దరు పిల్లలు ఉన్న ఆ మౌనిత ఎందుకు ఇతని మీద అంత ఇష్టం పెంచుకుంది నిజంగా తనది పిచ్చి ప్రేమ నేను మాత్రం దీప చనిపోగానే కార్తీక్ ను పెళ్లి చేసుకొని ఆ కోట్ల రూపాయల ఆస్తిని దక్కించుకుంటాను నేను అనుకున్నది జరగాలంటే దీప మనసు మార్చాలి అని అనుకుంటుంది.