జూనియర్ ఎన్టీఆర్ జ్ఞాపకశక్తి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన జబర్థస్త్ కమెడియన్ గడ్డం నవీన్?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా బాగా పాపులర్ అయ్యారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ చాలామందికి సినిమాలలో నటించే అవకాశాలు కూడా దక్కుతున్నాయి. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన గడ్డం నవీన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ లో తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నవీన్ సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకున్నాడు. ఎన్నో సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటించి వెండితెర ప్రేక్షకులకు సైతం ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం నవీన్ జబర్థస్త్ కి దూరమైన కూడా అతని క్రేజ్ మాత్రం తగ్గటం లేదు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న గడ్డం నవీన్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కిక్ 2, సైరా నరసింహారెడ్డి, ధ్రువ, అశోక్, ఆచార్య వంటి సినిమాలలో నటించినట్లు నవీన్ వెల్లడించాడు. కానీ నవీన్ అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోవడంతో అతనిని గుర్తుపట్టలేరని వెల్లడించాడు. ఇటీవల విడుదలైన ఆచార్య సినిమాలో కూడా చాలామంది మంచి పాత్రలో నటించానని కాకపోతే ఎడిటింగ్ లో దాన్ని తొలగించారని చెప్పుకొచ్చాడు. ఇక సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ సమయంలో కూడా చిరంజీవి తనను మెచ్చుకున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు.

ఇక ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జూనియర్ ఎన్టీఆర్కి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ అని వెల్లడించాడు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రామయ్య వస్తావయ్య సినిమాలో నటించానని.. కాకపోతే ఆ పాత్ర వల్ల సరైన గుర్తింపు లభించలేదని చెప్పుకొచ్చాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఢీ షో కి గెస్ట్ గా వచ్చినప్పుడు తనని గుర్తుపట్టి మరి తన చేయి పట్టుకొని తీసుకెళ్లారని నవీన్ వెల్లడించాడు. ఇక ప్రస్తుతం నవీన్ అడపాదడపా సినిమాలలో నటిస్తూ బయట కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. తొందర్లోనే ఆహా లో ప్రసారం కావున “కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్” అనే షోలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.