సుదీర్ఘ కాలంగా కొనసాగిన సుమ క్యాష్ షో నిలిపివేయటానికి అదే కారణమా?

బుల్లితెర మీద ఎన్నో రియాలిటీ షోలు ప్రసారం అవుతున్నాయి. ఈ రియాలిటీ షో ల వల్ల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈటీవీ రియాలిటీ షోలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కామెడీ, డాన్స్, సింగింగ్ వంటి అనేక షోలు ఈటీవీలో ప్రసారమవుతున్నాయి. ఇలా ప్రసారమవుతున్న వాటిలో క్యాష్ షో కూడా ఒకటి. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ క్యాష్ షో కి సుమా యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ క్యాష్ షో కి వచ్చే సెలబ్రెటీలతో సుమా చేసే సందడి అంతా ఇంతా ఉండదు. ఇలా ఎన్నో ఏళ్లుగా నిర్విఘ్నంగా ప్రసారమవుతున్న క్యాష్ షో మంచి రేటింగ్స్ తో దోసుకుపోయింది.

అయితే ఇలా మంచి రేటింగ్స్ తో ఉన్న ఈ క్యాష్ షో ప్రసారాన్ని ఈటీవీ నిలిపివేసింది. అయితే ఇలా ఈ షో ఆపివేయటానికి గల కారణాల గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. బుల్లితెర వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నో ఏళ్లుగా మంచి టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకున్న క్యాష్ షో నిలిపివేయడానికి ముఖ్య కారణం ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలు. సుదీర్ఘకాలంగా ఈ షో ప్రసారం కావడం వల్ల ఒకసారి వచ్చిన సెలబ్రిటీలే ఈ షో కి మరలా మరలా వస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ షో కొనసాగటంతో పాటు వచ్చిన సెలబ్రిటీ లేదు మళ్ళీ మళ్ళీ గెస్ట్లుగా రావటంతో ప్రేక్షకులు ఈ షో చూడటానికి చాలా బోర్ గా ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలో షో టిఆర్పి రేటింగ్స్ కూడా బాగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా ప్రతి వారం కొత్త సెలబ్రిటీ గెస్ట్ లను తీసుకు రావడం కష్టంగా మారుతుంది. అందుకనే క్యాష్ కార్యక్రమాన్ని ఆపేసినట్లుగా మల్లెమాల వారు సమాచారం. ఇక క్యాష్ షో ప్రసారాన్ని నిరుపివేసిన ఈటీవీ సుమ యాంకర్ గా సరికొత్త షో ప్రారంభించారు. ‘సుమ అడ్డా ‘ గా ప్రారంభమైన ఈ షో జనవరి 7వ తేదీన మొదటి ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఈ షోలో కూడా సెలబ్రిటీలు గెస్ట్లుగా పాల్గొని సందడి చేస్తున్నారు. ఇక క్యాష్ షో లాగే ఈ షోలో కూడా సుమా సెలెబ్రిటీలతో కలిసి సందడి చేస్తూ వారిని ముప్పతిప్పలు పెట్టి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఇక ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరు కావడంతో ఈ షో కి అధిక రేటింగ్స్ రావటం ఖాయమని మల్లెమాలవారు అభిప్రాయపడుతున్నారు.